Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానసిక ఒత్తిడితోనే పరాజయం: సైనా నెహ్వాల్

Webdunia
మానసికపరమైన ఒత్తిడి వల్లే తాను మలేషియా బ్యాడ్మింటన్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టోర్నీలో ఓటమి చవిచూడటానికి కారణమని భారత షట్లర్ స్టార్ సైనా నెహ్వాల్ వెల్లడించింది. ఇండోనిషియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన తర్వాత అదే ఊపును మలేషియాలో కొనసాగించినప్పటికీ.. త్వరగా అలసిపోయానని పేర్కొంది.

మలేషియా ఓపెన్ క్వార్టర్స్‌లో జరిగిన మ్యాచ్‌లో చైనాకు చెందిన క్వాలిఫైయర్ క్సిన్ వాంగ్ చేతిలో సైనా కంగుతింది. దీంతో మలేషియా ఓపెన్ టైటిల్‌ను కూడా గెలవాలన్న సైనా ఆశలకు గండి పడింది. మలేషియా నుండి తిరిగి భారత్ చేరిన ఒక రోజు తర్వాత సైనా విలేకరులతో మాట్లాడింది.

తాను పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ను సంతరించుకున్నప్పటికీ.. మానసికంగా బాగా అలసిపోయానని తెలిపింది. మలేషియా ఓపెన్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో కొన్ని పాయింట్లు తేలికగా వచ్చినప్పటికీ.. వాటితో విజయం అందుకోలేకపోయానని వివరించింది.

ఏదేమయినప్పటికీ.. ఈ ఏడాది ఆగస్ట్‌లో ప్రారంభం కానున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌పై దృష్టి సారించానని సైనా పేర్కొంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments