ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సింగిల్స్లో తెలుగు తేజం సింధు పోరాటం ముగిసింది. దాంతో పుసర్ల వెంకట సింధుకు ప్రపంచ బ్యాడ్మింటన్లో కాంస్య పతకం దక్కింది. తనకన్నా మెరుగైన థాయిలాండ్ క్రీడాకారిణి రచనోక్ ఇంతినాన్ చేతిలో సింధు 21-10, 21-13 స్కోరుతో పరాజయం పాలైంది.
శనివారం జరిగిన ఈ మ్యాచ్ 36 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. ఈ పోరాటంలో మొదటి సెట్లో సింధు చేసిన పొరబాట్లతో నాలుగో సీడ్ రచనోక్ లాభపడగా, రెండో గేమ్లో సింధు పుంజుకున్నప్పటికీ, ప్రత్యర్థికి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
ఫలితంగా కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్లో ప్రకాష్ పడుకొనే తర్వాత వ్యక్తిగత పతకం సాధించిన క్రీడాకారిణి సింధు కావడం విశేషం.