ప్యారిస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో కిమ్ క్లియస్టర్స్కు చుక్కెదురైంది. ప్యారిస్ ఓపెన్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో జర్మనీకి చెందిన క్రిస్టినా బరోయిస్ చేతిలో కిమ్ క్లియస్టర్ల్ అనూహ్యంగా ఓడిపోయింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న కిమ్ క్లియస్టర్స్, క్రిస్టినాతో జరిగిన మ్యాచ్లో ధీటుగా రాణించలేకపోయింది.
స్టేడ్ కోబర్టిన్ సెమీఫైనల్కు చేరుకున్న క్లియస్టర్స్, ప్యారిస్ ఓపెన్లో మాత్రం ఖంగుతింది. త్వరలో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని సంపాదించుకుంటానని చెప్పిన క్లియస్టర్స్, ప్రపంచ నెంబర్ 78 ర్యాంకర్ బరోయిస్ చేతిలో పరాజయం పాలై ప్యారిస్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది.
బరోయిస్తో జరిగిన రెండో రౌండ్లో ప్రత్యర్థి నుంచి గట్టిపోటీని ఎదుర్కొన్న క్లియస్టర్స్ మాట్లాడుతూ.. ఒత్తిడికి గురికావడంతో ఈ హార్డ్ కోర్టు మ్యాచ్లో రాణించలేకపోయానని చెప్పింది. బరోయిస్ ఆద్యంతం గట్టిపోటీనిచ్చిందని, అందుకే తాను ఓడిపోవాల్సి వచ్చిందని వెల్లడించింది.