ఐటీఎఫ్ ఫ్యూచర్స్-2 పురుషుల టెన్నీస్ టోర్నీలో సాకేత్ మైనేని, సనమ్ సింగ్ జోడీ డబుల్స్ టైటిల్ను గెలుచుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఈ జంట 7-6, 6-3లతో శ్రీరామ్ బాలాజీ, రంజిత్ విరళిమురుగేసన్ జోడీపై విజయం సాధించింది.
సాకేత్, సనమ్ సింగ్లు సింగిల్స్లోనూ ఫైనల్కు దూసుకెళ్లారు. సెమీఫైనల్లో సాకేత్ 6-3, 6-1తో శ్రీరామ్ బాలాజీపై నెగ్గగా.. సనమ్ 6-3, 6-3తో విష్ణువర్థన్ను ఓడించారు. ఫైనల్ శనివారం జరుతుంది. భీమవరంలోని కాస్మోక్లబ్లో ఈ అంతర్జాతీయ టోర్నమెంట్ జరుగుతోంది.