విజయవాడ ఆతిథ్యమిచ్చిన ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ విజయభేరి మోగించింది. ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత టెన్నిస్ స్టార్, ఏడో సీడ్ రూపేష్ రాయ్ ఫైనల్లో గెలిచాడు.
విజయవాడలోని ఐజీఎమ్సీ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ లెవల్-2 పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో విష్ణు వర్ధన్ను రూపేష్ రాయ్ మట్టికరిపించాడు. రెండు గంటల 15 నిమిషాల పాటు జరిగిన ఫైనల్ పోరులో విష్ణువర్ధన్పై రూపేష్ రాయ్ గట్టిపోటీని ప్రదర్శించాడు. ఫలితంగా మ్యాచ్ను సొంతం చేసుకుని 2-1 తేడాతో భారత్ను గెలిపించాడు.
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్లో ఫ్రాన్స్, అర్జెంటీనా, స్పెయిన్, ఇటలీ, హంగేరి, చెక్రిపబ్లిక్, రష్యా, సెర్బియా, స్లోవాకియా దేశాలకు చెందిన 40 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ టోర్నీలో భారత్ సింగిల్స్, డబుల్స్ టైటిళ్లను సొంతం చేసుకోవడం విశేషం.