గాయంతో మూడు వారాలపాటు విరామం తీసుకున్న సైనా నెహ్వాల్ తిరిగి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్కు బుధవారం బరిలోకి దిగనుంది. తన పాత ఫ్రెంచ్ ప్రత్యర్థి హోగ్యాన్ పైతో ఈ సిరీస్లో తలపడనుంది.
భుజానికి తగిలిన గాయం కారణంగా గత నెలలో జరిగిన నేషనల్ బ్యాట్మింటన్ ఛాంపియన్షిప్కు దూరమైంది. అయితే ఇప్పుడామే పూర్తి ఫిట్నెస్తో ఉందని కోచ్ పుల్లెల గోపీచంద్ వెల్లడించారు. కాగా గాయం తర్వాత ఆమె ఆడుతున్న మొట్టమొదటి టోర్నమెంట్ ఇదేనని పుల్లెల తెలిపాడు.
ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ... గాయం ప్రభావం ఆమె ఆటతీరుపై ఉండకపోవచ్చునన్నాడు. అయితే గాయానికి సంబంధించిన ఆందోళన ఆటలో కొద్దిసేపు ఉన్నప్పటికీ సైనా దానిని అధిగమించగలదని ధీమా వ్యక్తం చేశాడు.