ఆసియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో చైనా క్రీడాకారుల హవా కొనసాగుతోంది. చైనాకు చెందిన పురుషులు, మహిళల జట్లు ఆసియన్ టీటీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి.
ఇందులో భాగంగా చైనా పురుషుల జట్టు భారత్ను 3-1 తేడాతో ఓడించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. అలాగే చైనా మహిళల జట్టు థాయ్లాండ్పై 3-0 తేడాతో నెగ్గింది.
చైనాతో పాటు హాంగ్కాంగ్, సింగపూర్, కొరియాలు కూడా ఆసియన్ టేబుల్ టెన్నిస్ సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో హాంగ్కాంగ్ జట్టు కొరియాపై 3-1 తేడాతో ఓడించగా, జపాన్ కొరియాపై 3-1, చైనీస్ తైపీ సింగపూర్ను మట్టికరిపించాయి.
అలాగే మహిళల విభాగంలో కొరియాపై 3-0తో నెగ్గిన సింగపూర్, జపాన్ను 3-1 తేడాతో ఓడించిన కొరియా జట్లు సైమీఫైనల్లోకి చేరుకున్నాయి.