Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతిచే కామన్‌వెల్త్ యూత్ గేమ్స్ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 10 అక్టోబరు 2008 (19:24 IST)
పూనే వేదికగా ఆదివారం నుంచి ప్రారంభంకానున్న కామన్‌వెల్త్ యూత్ గేమ్స్‌ను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులను ముఖ్య అతిధులుగా విచ్చేయనున్నారు.

అక్టోబర్ 12 నుంచి 18 వరకు జరగనున్న ఈ కామన్‌వెల్త్ యూత్ గేమ్స్ ప్రారంభోత్సవానికి విచ్చేయనున్నవారి వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. రాష్ట్రపతిచే ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టెన్నిస్ బ్యూటీ సానియామీర్జా తల్లి నసీమా విచ్చేయనున్నారు.

ఈమెతో పాటు పరుగుల రాణి పీటీ ఉష, వెయిట్ లిప్టర్ కరణం మల్లీశ్వరి, టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, మాజీ ఒలింపిక్ షూటింగ్ విజేత రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, లాంగ్ జంప్ క్రీడాకారిణి అంజూ బాబీ జార్జ్ విచ్చేయనున్నారు. వీరితోపాటు బీజింగ్ ఒలింపిక్‌ పతక విజేతలైన అభినవ్ బింద్రా, విజేందర్ సింగ్, సుశీల్ కుమార్‌లు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడ్డారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్యగాయకులచే సంగీత విభావరిని కూడా జరిపించనున్నారు. అలాగే ఈ గేమ్స్ ముగింపు కార్యక్రమానికి మాజీ క్రీడాకారుడు మిల్కా సింగ్, మాజీ భారత జట్టు స్పిన్ బౌలర్ బిషన్ సింగ్ బేడీ తదితరులు విచ్చేయనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments