టెన్నిస్ను కెరీర్గా ఎంచుకున్న వారు ఎవరైనా సరే గ్రాండ్స్లామ్ టైటిల్ గెలుచుకోవాలన్న తపన, ఆకాంక్ష తప్పక ఉండి తీరుతుంది. కనీసం ఒక్కసారైనా ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్ టైటిళ్లను అందుకుని తమ క్రీడా జీవితానికి ఒక అర్థం తీసుకురావాలని టెన్నిస్ ఆటగాళ్లు ఆరాటపడుతూ ఉంటారు.
టెన్నిస్ ప్రపంచంలో విభిన్న సిరీస్లలో క్రీడాకారులు పాల్గొంటుంటారు. ఈ సిరీస్లు వేటికవే ప్రత్యేకత సంతరించుకుని ఉంటాయి. అలాంటి వాటిల్లో.. ప్రతిష్టాత్మకమైనవి ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్ లాంటివి ఉన్నాయి. అయితే వీటన్నింటికంటే ప్రత్యేకమైనది.. టెన్నిస్ క్రీడాకారులకు ఒక స్వప్నం లాంటిది వింబుల్డన్.
టెన్నిస్ క్రీడాకారులకు వింబుల్డన్ ఒక స్వప్నం..
టైటిల్ సాధించకపోయినా.. వింబుల్డన్లో ఒక మ్యాచ్లోనైనా పాల్గొంటే చాలని క్రీడాకారులు అనుకుంటుంటారంటే అతిశయోక్తి కాదేమో.
ఎందుకంటే.. టెన్నిస్ ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్టాత్మకమైన టోర్నీ వింబుల్డన్. 1877లో తొలిసారిగా ఈ టోర్నీ ప్రారంభమైంది.
టైటిల్ సాధించకపోయినా.. వింబుల్డన్లో ఒక మ్యాచ్లోనైనా పాల్గొంటే చాలని క్రీడాకారులు అనుకుంటుంటారంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే.. టెన్నిస్ ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్టాత్మకమైన టోర్నీ వింబుల్డన్. 1877లో తొలిసారిగా ఈ టోర్నీ ప్రారంభమైంది. లండన్లోని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ తరపున ఈ టోర్నీని పచ్చగడ్డి కోర్టు (గ్రాస్ కోర్టు)ల్లో నిర్వహిస్తారు.
వింబుల్డన్ కోసం నిర్వహించే పురుషుల వార్మప్ సిరీస్ టోర్నమెంట్ అయిన క్వీన్స్ క్లబ్ ఓపెన్ సిరీస్ జరిగిన రెండు వారాల తర్వాత ఈ వింబుల్డన్ టోర్నీ జరుగుతుంది. 13 రోజుల పాటు జరిగే ఈ టోర్నీ సోమవారం ప్రారంభమై ఆదివారంతో ముగుస్తుంది. పురుషుల, మహిళల కేటగిరీల్లో ఒక్కో విభాగంలో సింగిల్స్ ఈవెంట్లో 128 మంది క్రీడాకారులు, డబుల్స్ ఈవెంట్లో 64 జోడీలు, మిక్స్ డబుల్స్ ఈవెంట్లో 48 జోడీలు పాల్గొంటాయి.
వింబుల్డన్ చరిత్ర..
1877 లో వింబుల్డన్ టోర్నీ టైటిల్ను 'ఆల్ ఇంగ్లాండ్ క్రొకెట్ మరియు లాన్ టెన్నిస్ క్లబ్ ఛాంపియన్షిప్'గా పేరు మార్చారు. అలాగే నియమ నిబంధనల్లోను కొత్త మార్పులు చేశారు. అదే ఏడాదిలో 'జెంటిల్మన్ సింగిల్స్ టైటిల్'ను నిర్వహించారు. ఈ టైటిల్ను తొలిసారిగా 200 మంది వీక్షకుల మధ్య స్పెన్సర్ గోర్ కైవసం చేసుకున్నాడు. (తరువాయి పేజీకి క్రింద క్లిక్ చేయండి).
File
FILE
1882 లో 'ఆల్ ఇంగ్లాండ్ క్రొకెట్ మరియు లాన్ టెన్నిస్ టోర్నీ టైటిల్'లో క్రొకెట్ను తొలగించారు. అయితే.. సెంటిమెంట్ కారణంగా 1889లో తిరిగి దానికి 'ది ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ మరియు క్రొకెట్ క్లబ్'గా టైటిల్ను నిర్ణయించారు. 1884లో ఆల్ ఇండియా క్లబ్ మహిళల సింగిల్స్ మరియు జెంటిల్మేన్ డబుల్స్ విభాగాలను కూడా అదనంగా జోడించారు.
అలాగే 1913లో మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాలను జత చేశారు. ఇదిలా ఉంటే.. 1968ను టెన్నిస్లో మరో కొత్త ప్రారంభంగా చెప్పవచ్చు. టాప్ ర్యాంక్ క్రీడాకారులతో పూర్తి స్థాయిలో 1968లో వింబుల్డన్ టోర్నీని నిర్వహించారు. అప్పటి నుండి వింబుల్డన్ బ్రిటన్ వాసులకు ఎంతో గర్వకారణంగా నిలిచింది.
1922 లో వింబుల్డన్ పోటీలను చర్చి రోడ్డులో ఇంగ్లండ్ టెన్నిస్ క్లబ్ తరపున టోర్నీ నిర్వహించారు. ఇందుకుగాను బ్రిటన్లో 1980లో నాలుగు కొత్త కోర్టులను కూడా నిర్మించారు. 1997లో న్యూ నెంబర్ వన్ కోర్టును ప్రారంభించారు. ఇందులో తమాషా ఏంటంటే.. 1936లో పురుషుల విభాగంలో ఫ్రెడ్ పెర్రీ, 1977లో మహిళల విభాగంలో వర్జీనియా వర్జీనియా వాడేల తర్వాత ఒక్క వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ను కూడా బ్రిటన్ దక్కించుకోలేకపోయింది. 1984 మరియు 2008లలో బాలుర ఛాంపియన్షిప్ టైటిల్ను బ్రిటన్కు చెందిన అనాబెల్ క్రాఫ్ట్ మరియు లారా రాబ్సన్లు గెలుపొందారు.
ఇప్పటి వరకు పురుషుల సింగిల్స్ ఛాంపియన్షిప్లలో 2001లో మాత్రమే ఒకే ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ గొరాన్ ఇవానిసెవిక్ టైటిల్ను గెలుచుకున్నాడు. కానీ ఒక్క క్వాలిఫైయర్ కూడా ఈ టైటిల్ను ఇప్పటి వరకు సాధించలేదు. మహిళల డబుల్స్ మరియు మిక్సడ్ డబుల్స్లు మినహాయిస్తే.. 1922 వరకు గత ఏడాది పోటీల్లో విజేతలకు నేరుగా ఫైనల్ రౌండుకు 'బై'ను అనుమతించేవారు. అయితే ఆ తర్వాత ఆ విధానానికి స్వస్తి పలికారు.
2007 లో 23వ సీడ్గా బరిలోకి దిగి వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్న అతి తక్కువ సీడ్ మహిళా క్రీడాకారిణిగా అమెరికాకు చెందిన వీనస్ విలియమ్స్ రికార్డ్ సృష్టించింది. మళ్లీ 2005లో 14వ సీడ్గా తాను నెలకొల్పిన రికార్డ్ను తానే బ్రేక్ చేసింది విలియమ్స్.