Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు... తగ్గిన బంగారం ధరలు

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2016 (17:42 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట సాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 267 పాయింట్లు లాభపడి 23,649 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్జ్చేంజ్‌ నిఫ్టీ 83 పాయింట్లు ఎగబాకి 7,191 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.45 వద్ద కొనసాగుతోంది. 
 
ఈ ట్రేడింగ్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌, హిందాల్కో, కెయిర్న్‌, ఓఎన్‌జీసీ, హీరో మోటోకార్ప్‌ తదితర షేర్లు లాభాలు పొందాయి. మారుతి, ఆసియన్‌ పెయింట్స్‌, బీహెచ్‌ఈఎల్‌, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ తదితర షేర్లు నష్టాలు చవిచూశాయి.
 
ఇదిలావుండగా, ప్రపంచ మార్కెట్ల ప్రభావం, వ్యాపారస్తుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో గురువారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. రూ. 100 తగ్గడంతో పదిగ్రాముల పసిడి ధర రూ.28,750కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,205.90 డాలర్లుగా ఉంది. మరో వైపు వెండి ధర మాత్రం గురువారం స్థిరంగా ఉంది. వ్యాపారులు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో వెండి ధర యధాతథంగా రూ.37,100 వద్ద ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Show comments