Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు... తగ్గిన బంగారం ధరలు

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2016 (17:42 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట సాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 267 పాయింట్లు లాభపడి 23,649 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్జ్చేంజ్‌ నిఫ్టీ 83 పాయింట్లు ఎగబాకి 7,191 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.45 వద్ద కొనసాగుతోంది. 
 
ఈ ట్రేడింగ్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌, హిందాల్కో, కెయిర్న్‌, ఓఎన్‌జీసీ, హీరో మోటోకార్ప్‌ తదితర షేర్లు లాభాలు పొందాయి. మారుతి, ఆసియన్‌ పెయింట్స్‌, బీహెచ్‌ఈఎల్‌, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ తదితర షేర్లు నష్టాలు చవిచూశాయి.
 
ఇదిలావుండగా, ప్రపంచ మార్కెట్ల ప్రభావం, వ్యాపారస్తుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో గురువారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. రూ. 100 తగ్గడంతో పదిగ్రాముల పసిడి ధర రూ.28,750కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,205.90 డాలర్లుగా ఉంది. మరో వైపు వెండి ధర మాత్రం గురువారం స్థిరంగా ఉంది. వ్యాపారులు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో వెండి ధర యధాతథంగా రూ.37,100 వద్ద ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

Show comments