Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాక్ మార్కెట్ : 202 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2015 (18:41 IST)
స్టాక్ మార్కెట్లు గురువారం కూడా నష్టాల్లో ముగిశాయి. గురువారం నాటి ట్రేడింగ్‌కు ముగిసే సమయానికి 202 పాయింట్ల మేరకు నష్టపోయి 26,838 వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ కూడా 59 పాయింట్లు నష్టపోయి 8,112 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ పతనం ట్రేడింగ్ నాలుగో సెషన్‌లో సంభవించింది. యుఎస్ ఫెడరల్ రిజర్వు బ్యాంకు వచ్చే డిసెంబర్ నెలలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న సంకేతాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 
 
ఈ ట్రేడింగ్‌లో ప్రధానంగా భెల్, యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా, కోల్ ఇండియా, ఎస్.బి.ఐ, హెచ్‌యుఎల్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, గెయిల్, హిండాల్కో, ఎల్ అండ్ టి, మారుతి సుజుకి, టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు బాగా నష్టపోగా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, వేదాంత, టాటా మోటార్స్, రిల్, బజాజ్ ఆటో, హీరో మోటాకార్ప్, టాటా స్టీల్‌ కంపెనీల షేర్లు లాభాల్లో పయనించాయి. 
 
ఇకపోతే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.26,801ల వద్ద ఉంది. కేజీ వెండి ధర రూ.37,164ల వద్ద ఉంది. డాలర్‌ మారకం విలువ రూ.65.16లుగా ఉంది. 
 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments