మదుపరులకు చుక్కలు.. గరిష్టాల నుంచి వెనక్కి తగ్గిన సూచీలు

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (21:25 IST)
BSE
దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపరులకు చుక్కలు చూపిస్తున్నాయి. లాభాలతో సరికొత్త రికార్డులను చేరుతాయనుకుంటే.. మదుపర్ల ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి. శుక్రవారం వారాంతం రోజున చారిత్రక గరిష్టాలనుంచి కీలక సూచీలు వెనక్కి తగ్గాయి. 
 
అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో గురువారం సెన్సెక్స్‌ తొలిసారి 50వేల మార్క్‌ను తాకింది. అదే సెషన్‌లో మదుపర్లు అమ్మకాలకు దిగడంతో తుదకు నష్టాలను మూటగట్టుకోగా.. వారాంతం సెషన్‌లోనూ అమ్మకాల పరంపర కొనసాగింది. 
 
శుక్రవారం సెషన్‌లో ఉదయం లాభాల్లోనే మార్కెట్లు ప్రారంభమైనప్పటికీ.. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల వైపు సాగడంతో సెన్సెక్స్‌ ఏకంగా 49వేల దిగువకు పడిపోయింది. దీంతో వరుసగా రెండు రోజులు నష్టపోయినట్లయ్యింది. సెన్సెక్స్‌ తుదకు 746 పాయింట్లు కోల్పోయి 48,878.54 కనిష్టానికి పడిపోయింది. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ షేర్‌ 2.30 శాతం లేదా రూ.48.20 పతనమై రూ.2,049.65కు దిగజారింది.
 
మిడ్‌ క్యాప్‌ సూచీ 1.1 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.93 శాతం చొప్పున తగ్గాయి. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 14,372 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఏకంగా 218 పాయింట్ల నష్టంతో 14372కు దిగజారింది. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఆటో తప్పా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments