స్టాక్ మార్కెట్ మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో 18 పాయింట్ల మేరకు వృద్ధి చెందిన సెన్సెక్, మరో గంట వ్యవధిలో 75 పాయింట్ల మేరకు నష్టపోయింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 15820 వద్ద ట్రేడింగ్ సాగుతోంది.
ఇకపోతే.. నిఫ్టీ సైతం 23 పాయింట్ల మేరకు కోల్పోయి 4687 మీద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా పతనావస్థలో ఉండటం వల్ల దేశీయ మార్కెట్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది.