Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతయ్య పంచ్: కుంట లేని వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు!!

Webdunia
FILE
దేశ రాజకీయాల్లో రోజు రోజుకీ పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ ముద్రతో కోట్లాది రూపాయలను దండుకునే రాజకీయ నేతలు ఎక్కువైపోతున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే కోట్లు దండుకుంటున్నారనే వార్తలు వినొస్తున్నాయి. అందుకే కాబోలు సీతయ్య హీరో హరికృష్ణ కూడా కుంటలేని వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారని బావ మరిది ఇండైరక్ట్‌గా దెప్పిపొడిచారు.

ఈ సెటైర్ తన బావమరిది కాదు.. రాజకీయ నేతలందరికీ కాబోలు. ఈ మాటలు ఎదుటివారు సంపాదించుకుంటున్నారనే ఆక్రోషంతో అన్నారో లేక... ఎందుకో తెలియదు గానీ మొత్తానికి సీతయ్య, బాబయ్య కోల్డ్‌వార్ ప్రారంభమైంది.

తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన బావమరిది పొలిట్ బ్యూరో సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం రోజు రోజుకు ముదిరి పాకానపడుతోంది. కుంటలేని వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారని హరికృష్ణ రాసిన బహిరంగ లేఖతో నందమూరి - నారా కుటుంబాల మధ్య విబేధాలు బహిర్గతమయ్యాయి. ఈ విబేధాలు కాస్త ఇరువర్గాల మధ్య చినికి చినికి గాలివానగా మారింది.

హరికృష్ణ రాసిన బహిరంగ లేఖను చంద్రబాబు హైదరాబాద్‌లో నిర్వహించిన అవినీతి ర్యాలీ సందర్భంగా విడుదల చేయడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే కృష్ణా జిల్లాలో గ్రూపులు వేదికగా ఇరువురు నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. దేవినేని ఉమకు బాబు బాసటపై హరికృష్ణ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలో ఇలాంటి విభేదాలు పొడచూపడం ద్వారా చంద్రబాబు, హరికృష్ణల మధ్య దూరం పెరిగిపోతోంది. ఇరు కుటుంబాల మధ్య గల విభేదాలను జూనియర్ ఎన్టీఆర్ కూడా ఖండించకపోవడంతో హరి-బాబుల మధ్య తప్పకుండా విభేదాలు రాజుకుంటున్నాయనడంలో ఎలాంటి సంశయమూ లేదు.

కాగా, నందమూరి హరికృష్ణ సంధించిన బహిరంగ లేఖాస్త్రం తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తన తండ్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ డాక్టర్ ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం త్వరలోనే మీ ముందుకు వస్తానంటూ హరికృష్ణ తన లేఖలో పేర్కొనడం తెదేపా శ్రేణులను విస్తుపోయేలా చేసింది.

ఎన్టీఆర్ ఆశయాల పరిరక్షణ కోసం తాను పోరాడతానని హరికృష్ణ ఆ బహిరంగ లేఖలో విమర్శనాస్త్రాలు సంధించారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను వెలికి తీయాలని హరికృష్ణ డిమాండ్ చేశారు. మొత్తం మీద సీతయ్య సంధించిన లేఖాస్త్రం ఆ పార్టీలో పెను తుఫానునే సృష్టించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

Show comments