Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతన్నల ఆరోగ్యమంటే అంత చులకనా...!

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2008 (19:03 IST)
FileFILE
వార్త : చేనేత కార్మికుల చావులను ఆత్మహత్యలుగా చిత్రీకరించడం సరికాదని, సంవత్సరాల తరబడి రంగులు, రసాయనాలు, దుమ్ము, ధూళిలో పనిచేస్తున్నందున చేనేత కార్మికులు అనారోగ్యం బారిన పడి మరణించారని రాష్ట్ర రాజీవ్ విద్యామిషన్ మంత్రి హనుమంతరావు పేర్కొన్నారు.

చెవాకు : బాగానే ఉంది మంత్రి గారూ, కటిక దారిద్ర్యంతో అప్పుల ఊబిలో చిక్కుకుంటున్న చేనేత కార్మికుల చావులు ఆత్మహత్యలు కాదనడం భేషుగ్గానే ఉంది. వయసు మళ్లక ముందు చావు అనారోగ్యంతోనో, ప్రమాదం, హత్య లేక ఆత్మహత్య ద్వారానో జరగాలి.

ఈ లెక్కన చూస్తే చిన్న వయసులోనే చేనేత కార్మికులు చనిపోవడానికి మీ అభిప్రాయం ప్రకారమైతే ఆత్మహత్య కారణం కాదు, అలాగే ప్రమాదం, హత్యలు జరగడంలేదు. కానీ అనారోగ్యం కారణంగానే వారు చనిపోయారనుకుంటున్నా వారి పరిస్థితికి కారణం ఎవరు?

మీరు చెప్పినట్టు సంవత్సరాల తరబడి రంగులు, రసాయనాలు, దుమ్ము, ధూళిలో పనిచేస్తున్నందున వారు అనారోగ్యం పాలవుతున్నారనుకుంటాం. అంటే వారి అనారోగ్యానికి కారణాలు తెలిసి కూడా వాటి నుంచి వారికి విముక్తి కల్పించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా.

మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా నాలుగేళ్లు దాటింది. ఇంకా కూడా వారి చావులు కొనసాగుతున్నాయంటే అందుకు మీరూ బాధ్యులే కదా. రాజీవ్ ఆరోగ్య శ్రీతో అందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం అనారోగ్యం బారిన పడేందుకు అధిక అవకాశాలున్నట్టు చెబుతున్న చేనేత కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవచ్చుగా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

Show comments