Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ను పట్టిన ఏలినాటి శని తొలిగిపోయిందట..!

Webdunia
FILE
తెలంగాణ రాష్ట్ర సమితికి ఎన్నికల్లో కలిసిరాకపోవడం, ఆ పార్టీ అధ్యక్షుడు అవమానాలు, ఆరోపణలకు గురికావడం వంటి కార్యాలకు ఏలినాటి శనే కారణమని ఊహాగానాలు వస్తున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తనకు ఏలినాటి పట్టిందని కేసీఆరే స్వయంగా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ శని సెప్టెంబర్ తొమ్మిదో తేదీ రాత్రి 10.33 గంటలతో ఏలినాటి తొలగిపోయిందని, అలాగే పార్టీని పట్టిన అష్టమాదశ శని కూడా పోయిందని ఇటీవల జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ స్వయంగా పేర్కొన్నట్లు సమాచారం.

ఇకపై తన జాతకంతో పాటు, పార్టీ జాతకం కూడా బాగుంటుందని, తెలంగాణా ఉద్యమాన్ని ఢిల్లీని ప్రభావితం చేసేలా కార్యాచరణ చేయాలని పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినాన్ని సీరియస్‌గా జరపాలని, ప్రజల్లో తెలంగాణపై భక్తిని మరింత పెంచాలని కేసీఆర్ అన్నారు.

మొత్తానికి ఇకపై తెరాసకు మంచి రోజులేనని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తన ఆత్మశాంతి కోసం చెప్పుకుంటున్నారా? లేదా.. నిజంగానే ఆయనకు పట్టిన శని తొలగిపోయిందా? అనే విషయాన్ని చెప్పేందుకు మనమేమీ జ్యోతిష్యులం కాము. కానీ కేసీఆర్, తెరాస పార్టీ భవితవ్యంపై మీ అభిప్రాయాలేమిటో? చెప్పండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రిలో చేరిన చిరంజీవి తల్లి అంజనా దేవి.. హైదరాబాదుకు పవన్

సంపూర్ణేష్ బాబుతో పవన్ ఫోటో మార్ఫింగ్- హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు

Nara Lokesh: ఓల్డ్ స్టూడెంట్స్ పాఠశాల మార్గదర్శకులుగా మారాలి.. నారా లోకేష్

Cheetah: చిరుత హై జంప్.. అంత ఎత్తుకు ఎగిరి వ్యక్తిపై దాడి చేసింది.. (video)

చాక్లెట్ ఇస్తామంటూ చెప్పి చిన్నారిపై అత్యాచారం.. గట్టిగా కేకలు వేయడంతో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

Show comments