Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంతకీ...తప్పెవరిది?

Webdunia
శుక్రవారం, 26 సెప్టెంబరు 2008 (17:12 IST)
వార్త : ఎరువుల కొరతకు అక్రమనిల్వలే కారణమని ఆరోపణ చేసిన టీడీపీ నేతలు రెండు రోజులుగా కృష్ణా జిల్లాలో తాము జరిపిన తనిఖీల సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన 1.23 లక్షల ఎరువుల బస్తాలను కనుగొన్నామని తెలిపారు.

చెవాకు : సెభాష్. ఎట్టకేలకు ఓ మంచి పని చేశారు. రైతుల సమస్యను మీ భుజాలకెత్తుకుని రైతుల కోసం ఎరువుల అక్రమ నిల్వలను పసిగట్టి, బయటపెట్టారు. మీ ఆందోళన ఫలితంగా అధికారులు కూడా వాటిని 48 గంటల్లో ఎరువుల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు.

ఇంతవరకూ బాగానే ఉంది కానీ తప్పు ఎవరిదంటారు? ఈ అక్రమ నిల్వల ద్వారా తప్పు చేసిన వారు ఎవరనే విషయం తెలుస్తూనే ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఆ అక్రమార్కుల భరతం పట్టే వరకు మీ ఆందోళన కొనసాగించాలిగా.

కేవలం ప్రభుత్వంపై బురదజల్లడం వరకే మా పని అనుకుంటే సరిపోదు. రైతులకు అన్యాయం తలపెట్టిన వారికి తగిన గుణపాఠం నేర్పే వరకు పోరాటాన్ని కొనసాగిస్తేనే దానికి ఓ అర్థం ఉంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

Show comments