సంక్రాంతి పండుగ రోజున ఆవునేతితో.. శివునికి అభిషేకం చేయిస్తే?

సంక్రాంతి రోజున ఆడపిల్లలు ముగ్గుల మధ్య అందంగా గొబ్బిళ్లను తీర్చి దిద్ది, గొబ్బి పాటలు పాడుతూ కేరింతలు కొడుతుంటారు. అరెసెలు, చుక్కలు వంటి పిండి వంటలు నోరూరిస్తుంటాయి. ధనుర్మాసం నెల పెట్టింది మొదలు సంక్

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (13:24 IST)
సంక్రాంతి రోజున ఆడపిల్లలు ముగ్గుల మధ్య అందంగా గొబ్బిళ్లను తీర్చి దిద్ది, గొబ్బి పాటలు పాడుతూ కేరింతలు కొడుతుంటారు. అరెసెలు, చుక్కలు వంటి పిండి వంటలు నోరూరిస్తుంటాయి. ధనుర్మాసం నెల పెట్టింది మొదలు సంక్రాంతి పండుగ దాకా ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో కళకళలాడుతాయి. సంక్రాంతి  పండగ అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది.
 
మకర సంక్రాంతి నాటికి వంట ఇంటికి చేరడం ద్వారా సర్వత్రా ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే సంక్రాంతి రోజున ఆవునెయ్యితో శివుడికి అభిషేకం చేయిస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఇలాచేస్తే అన్ని భోగాలు ప్రాప్తించి చివరికి మోక్షం కలుగుతుందని పండితులు అంటున్నారు. 
 
ఇక మకర సంక్రాంతి మరుసటి రోజును కనుమ అంటారు. ఈ రోజున రైతుకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించడం ఆచారం. ఆ రోజున పశువుల కొట్టాలను చక్కగా అలంకరించి అక్కడ పొంగలి వండుతారు. ఆ పొంగలిని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీన్నే పొలి చల్లటం అని అంటారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయన్నది విశ్వాసం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విభూతి జలపాతంలో మునిగి పర్యాటకుడి మృతి

అమరావతిలో ప్రపంచ బ్యాంకు సాంకేతిక బృందం..

వెనక్కి తగ్గేదేలేదంటున్న ఇరాన్.. పౌరులు యుద్ధంలో పాల్గొనాలని పిలుపు

ఏపీ దేవాదాయ శాఖ ఏసీ కాళింగిరి శాంతి అరెస్టు

ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం... డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

అన్నీ చూడండి

లేటెస్ట్

05-04-2026 నుంచి 11-04-2026 వరకు ఫలితాలు- మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...

04-04-2026 శనివారం ఫలితాలు.. అదృష్ట యోగమే కలిసివస్తుంది..

03-04-2026 శుక్రవారం ఫలితాలు... అనుకోని సమస్య ఎదురవుతుంది

రాత్రి వేళ తిరుమల గిరులు ఎంత అద్భుతంగా వున్నాయో..? (video)

హనుమజ్జయంతి.. కోటి సంవత్సరాల ముందు పుట్టారు.. 41 రోజుల దీక్ష

తర్వాతి కథనం
Show comments