Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశువుల ప్రాధాన్యత పండుగ ‘కనుమ’... ఈరోజున ఏం తినాలో తెలుసా?

కనుమ పండుగ రైతులకు ముఖ్యమైన పండుగ. సంవత్సరమంతా పడిన శ్రమకు ఫలితమైన ధాన్యరాశులు నట్టింట నిలిచే రోజు. పాడిని ప్రసాదించిన గోమాతను, పంటకు సాయంగా నిలిచిన బసవన్నను ఈ రోజున రైతులు పూజిస్తారు. ఆ రోజు తెల్లవారగానే పశువులను శుభ్రంగా కడిగి, కొమ్ములకు – ముఖానికి

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (18:58 IST)
కనుమ పండుగ రైతులకు ముఖ్యమైన పండుగ. సంవత్సరమంతా పడిన శ్రమకు ఫలితమైన ధాన్యరాశులు నట్టింట నిలిచే రోజు. పాడిని ప్రసాదించిన గోమాతను, పంటకు సాయంగా నిలిచిన బసవన్నను ఈ రోజున రైతులు పూజిస్తారు. ఆ రోజు తెల్లవారగానే పశువులను శుభ్రంగా కడిగి, కొమ్ములకు – ముఖానికి పసుపు రాసి, కుంకుమబొట్లు పెట్టి పూలమాలలు వేస్తారు. అలంకరణకు కుచ్చులు కడతారు. కొమ్ములకు వెండి కొప్పులు ధరింపచేసి ఆకులో అన్నం పెట్టి తినిపిస్తారు. కొన్ని ప్రాంతాలలో గోపూజతో పాటు పక్షి పూజ కూడా చేస్తారు. 
 
రైతులు సంక్రాంతికి ముందుసాగే కుప్పనూర్పిళ్ళ సందర్భంలో వరివెన్నులను గుత్తులుగా చేర్చి, పిచ్చుకలు తినేందుకై ఇళ్ళలోను, దేవాలయ ప్రాంగణాలలోను కుచ్చులుగా కడతారు. దేవునికి వడ్ల కుచ్చు ఇస్తామని మొక్కుకుని, ఆ మొక్కును కనుమ రోజున తీర్చుకోవడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో స్త్రీలు చక్కగా అలంకరించుకొని తాము పక్షులకు పెట్టదలచుకున్న గింజలతో చెరువు గట్టుకో, బహిరంగ ప్రదేశానికో వెళ్ళి అక్కడ పక్షులకు మేత వేసి వస్తారు. 
 
పక్షులు ఎంత ఎక్కువగా వచ్చి, ఆ ముద్దలను ఆరగిస్తే అంత మంచి జరుగుతుందని నమ్మకం. మినుములతో చేసిన వంటకాలను ఈ రోజున తప్పక భుజించాలి. దీని వల్ల రాహు గ్రహ దోషనివారణ జరుగుతుంది.  అందరూ కనుమ రోజు మాంసం తినాలని అనుకుంటారు. అది తప్పుడు అభిప్రాయం. కనుమ పశువుల ప్రాముఖ్యతను తెలిపే పండుగ. నేడు పశువులను పూజించాలే తప్ప, భుజించకూడదు. నేడు కనీసం గుడ్డు కూడా తినరాదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

స్కంధ షష్టి - కుమారస్వామి పూజతో అంతా జయం

సోమవారం వ్రతం విశిష్టత- అర్థనారీశ్వర స్తోత్రం పఠిస్తూ తెల్లని పువ్వులు..

03-02- 2025 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

02-02-2025 ఆదివారం దినఫలితాలు : చేపట్టిన పనులు ముందుకు సాగవు...

వసంత పంచమి 2025.. విద్యార్థులే కాదు.. అందరూ పూజించవచ్చు.. ఈ రాశులకు?

తర్వాతి కథనం
Show comments