మకరసంక్రాతి రోజున పెరుగు దానం చేస్తే? అశ్వత్థామ ఎలా జన్మించాడో తెలుసా?

మకర సంక్రాంతి రోజున చేసే దానాలు విశేష ఫలితాలను ఇస్తుంది. దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది. పూర్వకాలంలో గుణవంతురాలు, పతీవ్రతా శిరోమణి అయిన ''కృపి'' అనే పుణ్యస్త్రీ ఉండేది. ఈమె ఎవరో కాదు. ద్రోణాచార్యుల భార

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (15:24 IST)
మకర సంక్రాంతి రోజున చేసే దానాలు విశేష ఫలితాలను ఇస్తుంది. దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది. పూర్వకాలంలో గుణవంతురాలు, పతీవ్రతా శిరోమణి అయిన ''కృపి'' అనే పుణ్యస్త్రీ ఉండేది. ఈమె ఎవరో కాదు. ద్రోణాచార్యుల భార్య. ఒకనాడు ద్రోణాచార్యుడు ఆశ్రమంలో లేని సమయంలో దుర్వాస ముని సమిధల కోసం అన్వేషణ సాగిస్తూ అటుగా వచ్చాడు. వచ్చిన మునిని కృపి పూజించి తమ పేదతనాన్ని చెప్పుకుంది. తమకు పిల్లలు కూడా లేరని చెప్పుకుంది. ఆమె ప్రార్థనకు ముని దయార్ద్ర హృదయుడై, సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకోవాల్సిందిగా ఉపదేశించాడు. 
 
ఆ వ్రత విధానం గురించి వివరిస్తూ.. ఇది వరకూ ఈ వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందిన యశోద గురించి చెప్తాడు. అందుకే మకర సంక్రాంతి రోజున బ్రాహ్మణులకు పెరుగన్నం దానం చేస్తే సంతానం, సౌభాగ్యం కలుగుతుందని వివరించాడుయ వెంటనే కృపి దగ్గరగా ఉన్న నదికి వెళ్ళి శరీరానికి నువ్వుల పిండి రాసుకుని స్నానం చేసి వచ్చి.. దుర్వాస మహామునికి పెరుగు దానం చేసింది. అలా దానం చేయడం ద్వారా ఆమెకు అశ్వత్థామ పుట్టాడు. ఈ విధంగా సంక్రాంతి నాడు దానాలు చేసినట్లైతే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇరాన్.. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం

ఎయిర్‌స్ట్రైక్‌లో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ హతం?

ఎంతో ఘనంగా జరిగిన రెండో పెళ్లి.. నాలుగో రోజే వరుడు ఆత్మహత్య

మద్యపానంతో భార్యాభర్తలు గొడవలు.. నలుగురు సభ్యుల మిస్సింగ్

గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు... దిక్కుతోచని స్థితిలో భారతీయ యాత్రికులు

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన టీటీడీ

28-02-2026 - శనివారం ఫలితాలు- మీ తప్పులు సరిదిద్దుకోవడం ఉత్తమం

27-02- 2026 శుక్రవారం ఫలితాలు : దూర ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు...

26-02-2026 గురువారం ఫలితాలు - కొత్త సమస్యలు తలెత్తకుండా...?

Hanuman Chalisa.. హనుమాన్ చాలీసాను రోజూ పఠిస్తే.. ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments