మధ్యప్రదేశ్‌లో ఖజురహో నాట్యోత్సవం

Webdunia
మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ సంప్రదాయమైన ఖజురహో నాట్య ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసింది. 10వ శతాబ్దంలోని చందెళ్ల సామ్రాజ్యంలో నాటి రాజులు నిర్మించిన చిత్రగుప్త ఆలయం, విశ్వనాథ ఆలయాల ముందు ఈ నాట్యాలు ప్రదర్శితం కానున్నాయి.

ఇటీవల కాలంలో ఖజురహో నాట్యోత్సవాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారు. ఈ ఉత్సవాల ప్రత్యేకత ఏమిటంటే... రమణీయ ఖజురహో శిల్ప సంపద నడుమ ఈ నాట్య ప్రదర్శనలను ఇవ్వడం. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాలను దేదీప్యమానమైన వెలుగులు విరజిమ్మే లైట్లతో అలంకరించారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించి అంతర్జాతీయ స్థాయిలో ఓ గుర్తింపును తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. జీవితాలకు దర్పణం లాంటిది ఖజురహో. అంతేకాదు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక.

దీనిని సుప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ ఖజురహో నాట్యోత్సవాలను ఏర్పాటు చేస్తున్నాం. దీనిని అంతర్జాతీయ దినోత్సవం గుర్తించాలని అడుగుతున్నాం. ఈ ఎన్నికలు అయిన తర్వాత ఈ విషయంపై కేంద్రాన్ని అడుగుతాం" అని అన్నారు.

ఖజురహో నాట్యోత్సవాలలో కథక్, ఒడిస్సీ, కథాకళి, భరతనాట్యం, కూచిపూడి, మణిపురి నాట్య రీతులను ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాన్ని 1975లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. నాటి నుంచి క్రమంగా ఈ ఉత్సవాలు అందరి మన్ననలూ పొందుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కడుపు నొప్పితో మహిళ స్కానింగుకి వస్తే ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధింపులు (video)

Gujarat: భార్యాభర్తల మధ్య కుక్క పెట్టిన లొల్లి.. విడాకుల వరకు వెళ్లింది..

ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు పేలుడు : మరో వైద్యుడు అరెస్టు

కారు బాంబు పేలుడు - వీడియోలు షేర్ చేసి పైశాచికానందం - అస్సాం సర్కారు ఉక్కుపాదం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నవంబర్ 17 నుంచి భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

Show comments