Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులకు ఇలవేల్పు భద్రాద్రి

Webdunia
మంగళవారం, 1 ఏప్రియల్ 2008 (15:35 IST)
గోదావరి నది ఒడ్డున వెలసిన సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి ఆలయం భక్తులకు ఇలవేల్పు. దక్షిణ భారతంలోని పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన భద్రాద్రిలో ప్రతిఏటా శ్రీరామ నవమినాడు కన్నులపండువగా ఉత్సవాలు నిర్వహిస్తారు. రామదాసుగా పిలువబడే కంచెర్ల గోపన్న ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో నిర్మించాడు.

ఆలయ నిర్మాణం:
పదిహేడవ శతాబ్దంలో తానీషా గోల్కొండను పాలిస్తుండేవాడు. ఆయన వద్ద గోపన్న మేనమామలైన అక్కన్న, మాదన్నలు మంత్రులుగా ఉండేవారు. ఆ తర్వాత గోపన్నను తహసీల్దారు పదవిని ఇచ్చారు. శ్రీరామచంద్రునిపై అపార భక్తి చేత ఆయన వసూలు చేసిన ప్రజల సొమ్ముతో భద్రాచలంలో స్వామివారికి ఆలయం కట్టించాడు.

ఈ విషయం తెలిసిన తానీషా గోపన్నను చెరలో బంధించాడు. ఆ సమయంలో ఆయన రామునిపై అనేక కీర్తనలు రాశాడు. భక్తుని కాపాడేందుకు స్వయంగా శ్రీరామచంద్రుడు దిగివచ్చి రుసుమును చెల్లించి గోపన్నను విడుదల చేయించాడు. అప్పట్నుంచీ ఆయనకు భక్త రామదాసు అన్న నామధేయం సార్థకమైంది.

స్థల పురాణం :
పూర్వం భద్రుడు చేసిన తపస్సు కోరిక మేరకు రాములవారు సతీసమేతంగా భద్రాద్రిలో వెలిశారని పురాణ కథలు చెబుతున్నాయి. మరో కథ ఏమంటే కైకేయి కోరిక మేరకు వనవాసానికి బయలుదేరిన సీతారాములు ఈ ప్రాంతంలోనే పర్ణశాల నిర్మించుకుని నివసించినట్టుగా ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమినాడు స్వామి వారికి కల్యాణ మహోత్సవాలు అతి వైభవంగా భద్రాద్రిలో జరుగుతాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments