Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరువనంతపురంలో రూ. 30 కోట్ల తామర చిహ్నం

Webdunia
WD
ప్రపంచ శాంతికి, సోదరభావానికి గుర్తుగా ఓ స్మారక చిహ్నాన్ని తిరువనంతపురంలో ఆవిష్కరించనున్నారు. వికసిస్తున్న తామర ఆకారంలో ఉన్న ఈ స్మారక చిహ్నాన్ని రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ఆగస్టు 12న ప్రారంభించనున్నారు. ఈ స్మారక చిహ్నాన్ని ప్రాచీన కాలపు మక్‌రానా మార్బుల్‌తో తయారు చేశారు. ఈ పర్ణశాలను కేరళ రాజధాని తిరువనంతపురానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతిగిరి ఆశ్రమం, పొతాన్‌కోడ్‌లో నిర్మించారు.

కులమతాలు, పేద ధనిక భేదాలు లేకుండా అందరిని ఆదరించే ఉద్ధేశ్యంతో ఈ ఆశ్రమాన్ని 1960లో ప్రారంభించారు. అన్నదానం, అథురసేవనం, ఆత్మభూభబ్నం అనేవి ఈ ఆశ్రమ ముఖ్య లక్ష్యాలు. "మాట సత్యం, సత్యం గరువు, గురువు దేవుడు" అని ఆశ్రమ నిర్వాహక సెక్రటరీ, జ్ఞాన తపస్వి స్వామి గురురత్నం అన్నారు. ఈ సిద్ధాంతాన్ని ఇక్కడి భక్తులందరూ విశ్వసిస్తారని ఆయన అన్నారు.

ఈ తామర ఆకారంలో ఉన్న స్మారక చిహ్న నిర్మాణ పనులను దాదాపు 10ఏళ్ల క్రితమే పర్ణశాలలో చేపట్టారు. ఇప్పుడు ఈ నిర్మాణ దశ పూర్తి కావస్తుంది. ఈ నిర్మాణానికి సంతిగిరి ఆశ్రమ వ్యవస్థాపకుడు నవజ్యోతిసీ కరుణాకర గురు ఆజ్యం పోశారు. ఈయన మే 1999లో పరమపదించారు. ఈ స్మారక చిహ్నాన్ని పర్ణశాలగా వినియోగిస్తారు. అంతే కాకుండా ఇది ఆధ్యాత్మిక నిలయం గానూ, ఒక చారిత్రాత్మక స్థూపంగానూ నిలువనుంది.

ఈ పర్ణశాల నిర్మాణం 91 అడుగుల ఎత్తును, 84 అడుగుల వెలుపలి వ్యాసాన్ని, అలాగే 61 అడుగుల లోపలి వ్యాసాన్ని కలిగి ఉండి 21 తామర రేకులను కలిగి ఉంటుంది. ఇందలో 12 తామర రేకులు పైకి విచ్చుకొని ఉండగా, 9 తామర రేకులు కింది భాగంవైపు ఉంటాయి. పైకి విచ్చుకొని ఉన్న 12 తామర రేకులు ఒక్కొక్కటి 41 అడుగుల ఎత్తును, క్రింది వైపుకు ఉన్న 9 తామర రేకులు 31 అడుగులు ఎత్తును కలిగి ఉంటాయి. ఈ నిర్మాణానికి రాజస్థాన్ నుంచి తెప్పించిన వైట్ మార్బుల్, కర్నాటక మైన్స్ నుంచి తెప్పించిన బ్లాక్ గ్రనైట్‌లను ఉపయోగించారు.

దాదాపు లక్ష చదరపు అడుగుల మార్బుల్‌ను రాజస్థాన్‌లాని మక్‌రానా నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ మొత్తం సముదాయం 21 స్థంబాల మీద ఆధారపడి నిర్మించారు. ఈ బాలాలయం (ఎలివేటెడ్ ఫ్లాట్‌ఫార్మ్) ప్రత్యేకించి వేడుకల కోసం అందమైన కాళాఖండాలతో నిర్మించారు. ఈ పర్ణశాలలోని మొదటి అంతస్థులో 12 గదులు ఉంటాయి. ఇందులో ఆశ్రమ గురువుకు చెందిన వస్తువులను భద్రపరుస్తారు.

ఈ పర్ణశాలలోని మధ్య భాగం(సరకూదమ్)లో 27 అడుగుల తామర పువ్వు ఆకారంలో చెక్కతో చేయబడి ఉంటుంది. దీని మధ్యభాగంలో మార్బల్‌తో చేయబడిన ఓ పెట్టెలాంటి ఆకారం ఉండి, దానిపై నుండి 11 మెట్లను కలిగి ఉంటుంది. ఈ స్థానంలో బంగారంతో చేసిన నిలువెత్తు గరువు విగ్రహాన్ని స్థాపించబడి ఉంటుంది.

ఈ పర్ణశాల వెలుపలి వైపు రంగురంగుల ఫ్లడ్‌లైట్లను కలిగి ఉండి రాత్రి సమయంలో వీక్షించిన వారికి వీనుల విందు కలిగిస్తుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 30 కోట్లు. గ్రంధాలయం, లెక్చర్ హాల్ మరికొన్ని మౌలిక నిర్మాణాలకు మరో రూ. 20 కోట్లు అవుతందని అంచనా.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments