Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో ప్రాచీన ఆలయ పునరుద్ధరణ

Webdunia
సోమవారం, 28 జనవరి 2008 (17:05 IST)
WD PhotoWD
బీహార్‌, వైష్ణో దేవీ ఆలయాల్లోని అతి పురాతన దేవాలయాల్లో కైమూర్ జిల్లాలోని ముండేశ్వరి పుణ్యక్షేత్రం ప్రసిద్ధమైనది. సుమారు 1900 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయం 608 అడుగుల ఎత్తుగల కొండపై ఉంది.

అతి ప్రాచీన కట్టడమైన ఈ ఆలయానికి సంబంధించి జీర్ణోద్ధరణ కార్యక్రమాలను నలందా విశ్వవిద్యాలయం, బీహార్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్నాయని ఆధ్యాత్మిక ట్రస్ట్ బోర్డ్ పరిపాలనాధికారి ఆచార్య కిషోర్ కునాల్ వెల్లడించారు. ఈ ఆలయం క్రీ.శ 108 సంవత్సరంలో కట్టబడిందని వివరించారు.

గుప్తుల కాలం నుంచే ఈ ఆలయం విశిష్టంగా పూజలందుకుంటోందని వెల్లడించారు. వారి కాలంలోనే ఈ ఆలయంలో అత్యద్భుతమైన శిల్పాలు, ప్రతిమలు, చిత్ర పటాలు.. ఆవిష్కరింపబడ్డాయని..ఇవి ఆలయ ప్రాశస్త్యానికి మరింత వన్నెతెచ్చేవిగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

ఈ దేవాలయంలో ఉన్న శిలాఫలకంపై రెండు శాసనాలు బ్రాహ్మీ లిపిలో ఉన్నాయని తెలిపారు. ఈ శాసనాల ద్వారా దేవాలయం గుప్తుల కాలం నాటి కంటే ముందే నిర్మించబడినట్లు పురావస్తు శాఖ నిపుణులు, చరిత్రకారులు పేర్కొంటున్నారు.

అంతేకాకుండా ఈ ఆలయంలో నాలుగు ముఖాలు గల శివుని విగ్రహం ఉందని.. ఈ ప్రతిమకు భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు చేస్తుంటారని పేర్కొన్నారు. ఈ ప్రతిమ కూడా అత్యంత పురాతనమైనదన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments