Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆభరణాల లెక్క నిగ్గు తేలుస్తాం : తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (16:43 IST)
తిరుమల తిరుపతి దేవస్థానపాలక మండలి (తితిదే) నూతన ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకోసం శ్రీవారి మెట్టు మార్గంలో ఆయన కాలిబాటన కొండపైకి నడిచివెళ్లారు. ఆ తర్వాత తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. పిమ్మట తితిదే పాలక మండలి ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 
 
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, తనతో పాటు తితిదేకు తొలి ప్రాధాన్యత సామాన్య భక్తులేనని చెప్పారు. తిరుమల గిరుల్లో ఉన్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని చెప్పారు. అలాగే, శ్రీవారి ఆభరణాల విషయంలో కూడా లెక్కలను నిగ్గు తేలుస్తామని ఆయన స్పష్టం చేశారు. 
 
అంతేకాకుండా, అర్చకుల సమస్యలపై పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, త్వరలోనే మఠాధిపతులు, పీఠాధిపతులతో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. కాగా, ఈయన గతంలో ఒంగోలు లోక్‌సభ సభ్యుడుగా ఉన్నారు. ఈ దఫా ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా మాగుంట శ్రీనివాస రెడ్డికి టిక్కెట్ ఇవ్వగా ఆయన గెలుపొందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Travel Bag: 2 నెలల గర్భవతిని హత్య చేశాడు.. ట్రావెల్‌ బ్యాగ్‌లో కుక్కి పారేశాడు..

Man Mums, ఒక్కసారి వాటేసుకుంటే రూ. 600 చెల్లిస్తున్న యువతులు, ఎందుకిలా?

AP ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Drunk man: తాగిన మత్తులో పక్కింటి మహిళను భార్యగా భావించి ఏం చేశాడంటే?

పాక్ డ్రోన్ దాడితో దెబ్బతిన్న ఇళ్లు: నష్టపరిహారం రూ. 6500, బ్యాంక్ చెక్‌ను ఫ్రేమ్ కట్టించుకుంటానన్న బాధితుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

03-06-2025 మంగళవారం దినఫలితాలు - ధనం అందుతుంది.. ఖర్చులు విపరీతం...

Washing Hands in Plate? భోజనం చేసిన తర్వాత కంచంలోనే చేతులు కడిగేస్తున్నారా?

02-06-2025 సోమవారం దినఫలితాలు - మీ వాక్కు ఫలిస్తుంది...

తర్వాతి కథనం
Show comments