Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆభరణాల లెక్క నిగ్గు తేలుస్తాం : తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (16:43 IST)
తిరుమల తిరుపతి దేవస్థానపాలక మండలి (తితిదే) నూతన ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకోసం శ్రీవారి మెట్టు మార్గంలో ఆయన కాలిబాటన కొండపైకి నడిచివెళ్లారు. ఆ తర్వాత తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. పిమ్మట తితిదే పాలక మండలి ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 
 
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, తనతో పాటు తితిదేకు తొలి ప్రాధాన్యత సామాన్య భక్తులేనని చెప్పారు. తిరుమల గిరుల్లో ఉన్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని చెప్పారు. అలాగే, శ్రీవారి ఆభరణాల విషయంలో కూడా లెక్కలను నిగ్గు తేలుస్తామని ఆయన స్పష్టం చేశారు. 
 
అంతేకాకుండా, అర్చకుల సమస్యలపై పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, త్వరలోనే మఠాధిపతులు, పీఠాధిపతులతో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. కాగా, ఈయన గతంలో ఒంగోలు లోక్‌సభ సభ్యుడుగా ఉన్నారు. ఈ దఫా ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా మాగుంట శ్రీనివాస రెడ్డికి టిక్కెట్ ఇవ్వగా ఆయన గెలుపొందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జననం

18-07-2025 శుక్రవారం దినఫలితాలు - మనోధైర్యంతో లక్ష్యసాధనకు కృషి చేయండి...

అజ్ఞానం, సందేహాలు తొలగిపోయి జ్ఞానం ఇచ్చేదే భగవద్గీత : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

తర్వాతి కథనం
Show comments