Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే అన్నప్రసాదంలో అవి గారెలా? వడలా?: తితిదే ఛైర్మన్‌కి ప్రశ్నల వర్షం

ఐవీఆర్
గురువారం, 6 మార్చి 2025 (18:03 IST)
తిరుమల తిరుపతి అన్నప్రసాదం మెనూలో అదనంగా మరో వంటకాన్ని చేర్చారు తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు. శ్రీవారి ప్రసాదంలో ఇంతకుముందు వున్నటువంటి ఓ వంటకాన్ని తిరిగి భక్తులకు అందించాలన్న తన ఆలోచనను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. వెంటనే ముఖ్యమంత్రి తితిదే చైర్మన్ యోచనకు అంగీకారం తెలపడంతో భక్తులకు ఈరోజు నుంచి రుచికరమైన అన్నప్రసాదంలో మరో వంటకం వచ్చి చేరింది.
 
ఈ సందర్భంగా తితిదే చైర్మన్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేస్తూ...  ఉ 10:30 నుండి సా 4 గంటల వరకు ప్రతిరోజు 35 వేల గారెలను భక్తులకు వడ్డిస్తాం. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి, భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తాం'' అని పేర్కొన్నారు.
 
ఈ సందేశాన్ని చూసిన పలువురు భక్తులు వడ్డిస్తున్నవి గారెలు కాదు చైర్మన్ గారూ... అవి వడలు అంటూ వెల్లడిస్తున్నారు. మరికొందరేమో.. ఈ వడలు ఎందుకండీ చక్కగా దీని బదులు ప్రసాదంగా ఇచ్చే పెద్ద వడలు అందరికీ లభ్యం అయ్యేటట్లు చూడండి అంటూ సలహా ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

లేటెస్ట్

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments