తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.... చేతులెత్తేసిన తితిదే

Webdunia
ఆదివారం, 27 మార్చి 2016 (11:28 IST)
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా నాలుగురోజుల పాటు సెలవు దినాలు కావడంతో ప్రపంచ నలమూలల నుంచి భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో ఎటు చూసిన భక్త జనసందోహమే దర్శనమిస్తోంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. తిరుమలలో ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులే తిరుమలలో ఎక్కువగా కనిపిస్తున్నారు. 
 
కొండపైకి భక్తుల తాకిడి అధికం కావడంతో తితిదే అధికారులు ఎప్పటిలాగే చేతులెత్తేశారు. తమకేమీ సంబంధం లేనట్లు భక్తులను రోడ్లపైనే వదిలేశారు. తితిదే ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ స్క్రీన్‌లలో గదులు లేవంటూ అన్నీ సున్నాలు చూపిస్తున్నాయి. దీంతో భక్తులు పార్క్ లతోపాటు, ఫుట్‌పాత్‌లపై సేదతీరుతున్నారు. ఆదివారం సాయంత్రం వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉందని టిటిడి అధికారులు భావిస్తున్నారు.
 
ఇదిలావుండగా, శనివారం శ్రీవారిని 87,301 మంది భక్తులు దర్శించుకోగా ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 17 గంటలకుపైగా దర్శన సమయం పడుతోంది. అలాగే కాలినడక భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 9 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 68 లక్షల రూపాయలు వచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వరితం 2026 శీర్షికన తమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న ముజిగల్ మల్కాజ్‌గిరి అకాడమీ

సీఎం విజయ్ బాటలో సూర్య రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా వుంటుంది?

హైదరాబాదులో వర్షాలు.. పెరుగుతున్న అనారోగ్య సమస్యలు.. జాగ్రత్తలు

Ambani Hospital: అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్.. ఎందుకు?

రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసు : కృష్ణలంక పీఎస్ హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటు

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Show comments