Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 11 నుంచి శ్రీవారి దర్శనం.. తలనీలాలు, పుణ్యస్నానాల్లేవు..

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (14:16 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనం జరుగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రాక కోసం ఏర్పాట్లను పూర్తి చేసింది. దీనికి సంబంధించిన నిబంధనలను టీటీడీ విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం కోసం అనుమతి ఇస్తామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ముందుగా సిబ్బందితో ట్రయల్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తామని చెప్పారు.
 
ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం అవకాశం ఉంటుంది. 10 ఏళ్లలోపు చిన్నపిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఎవరూ దర్శనానికి రాకూడదని సూచించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలన్నారు. 
 
ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా 3 వేల మందికి, నేరుగా వచ్చిన వారిలో 3 వేల మందికి మాత్రమే దర్శనం కల్పిస్తామని తెలిపారు. నేరుగా వచ్చే వారు అలిపిరి వద్ద రిజిస్టేషన్ చేయించుకోవాలని చెప్పారు. అలిపి నుంచే కాలినడకన అనుమతి ఉంటుందని చెప్పారు. శ్రీవారి నడక మార్గంలో రావద్దని పేర్కొన్నారు. మరోవైపు తలనీలాలు సమర్పించడం, పుణ్యస్నానాలు ఆచరించే వీలు లేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ఉచిత వివాహాలు.. ప్రేమ, రెండో పెళ్లిళ్లు చేయబడవు.. నియమాలు ఏంటి?

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

తర్వాతి కథనం
Show comments