శ్రీవారి భక్తులకు శుభవార్త.. త్వరలో యాప్ ద్వారా శ్రీవారి దర్శన టిక్కెట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తుల కోసం కొన్ని ప్రత్యేక యాప్‌లను రూపొందించనుంది. కేవలం ఇప్పటివరకు విఐపిలకు మాత్రమే అందుబాటులో ఉండే స్వామివారి సేవా టిక్కెట్లను సామాన్యులకే అందేలా చర్యలు తీసుకుంటోం

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (10:27 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తుల కోసం కొన్ని ప్రత్యేక యాప్‌లను రూపొందించనుంది. కేవలం ఇప్పటివరకు విఐపిలకు మాత్రమే అందుబాటులో ఉండే స్వామివారి సేవా టిక్కెట్లను సామాన్యులకే అందేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా సేవా టిక్కెట్లను అందిస్తున్న తితిదే మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. అదే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునేలా ప్రత్యేకమైన యాప్.
 
నిజంగా ఇది శ్రీవారి భక్తులకు శుభవార్తే. త్వరలో యాప్ ద్వారా శ్రీవారి దర్శన టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తితిదే ఈఓ సాంబశివరావు తెలిపారు. శ్రీవారి యాప్ పేరుతో గదులు, టిక్కెట్లు బుక్ చేసుకోవడం మరింత సులభతరం అవుతుంది. 
 
ఇప్పటికే ఈ యాప్‌ను తితిదే సిద్ధం చేసిందట. త్వరలో భక్తులకు అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ.. తితిదే వసతి సముదాయాల చుట్టూ భక్తులు తిరగాల్సిన అవసరం లేదు. నేరుగా యాప్ ద్వారా ఏది కావాలంటే అది దొరికే వీలుంది. అలాగే ఆన్‌లైన్‌‍లో 30 0రూపాయల టిక్కెట్ల సంఖ్యను ఆరు నుంచి పదికి పెంచుతూ తితిదే నిర్ణయం తీసుకుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

NEET పరీక్ష: Fathers Day నాడు కుమార్తె కోసం పోలీసు కాళ్లు పట్టుకున్న తండ్రి, వీడియో

ముంబైలో మళ్లీ కరోనా కేసులు.. రుతుపవనాలు లేటు కావడమే కారణం

ట్రేడింగ్‌లో నష్టపోయాడు.. కిడ్నాప్ అయ్యానని రూ.50లక్షలు డిమాండ్ (video)

కుటుంబ కలహాలు.. బిస్కెట్లలో ఎలుకల మందు పెట్టి ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి

హైదరాబాద్‌లో నీట్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య.. పాసవుతామో లేదోనని..?

అన్నీ చూడండి

లేటెస్ట్

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?

తర్వాతి కథనం
Show comments