Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ అమలుతో శ్రీవారి లడ్డూ ధర అప్.. గదులు, దర్శనటిక్కెట్లు కూడా..

జీఎస్టీ అమలుతో తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదం లడ్డూ ధరలు పెరగనున్నాయి. లడ్డూతో పాటు దర్శనం టిక్కెట్లు, ప్రసాదాల ధరలు కూడా పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానమే లక్ష్యంగా జూలై 1వ తేదీ నుంచి కే

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (13:38 IST)
జీఎస్టీ అమలుతో తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదం లడ్డూ ధరలు పెరగనున్నాయి. లడ్డూతో పాటు దర్శనం టిక్కెట్లు, ప్రసాదాల ధరలు కూడా పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానమే లక్ష్యంగా జూలై 1వ తేదీ నుంచి కేంద్రం జీఎస్టీని అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ విధానాలు ప్రతి ఏడాది రూ.20లక్షలకు పైగా ఆదాయం ఆర్జించే ఆలయాలకు కూడా వర్తిస్తాయి. 
 
ఈ క్రమంలో కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జించే తిరుమల శ్రీవారి ఆలయానికి కూడా జీఎస్టీ విధానాలు వర్తిస్తాయి. తద్వారా తిరుమల వెంకన్న ఆలయంలోని ప్రసాదాల ధరలు, దర్శన టిక్కెట్ల ధరలు పెరుగుతాయి. 
 
ప్రస్తుతం ఒక లడ్డూ తయారీకి రూ.35లు ఖర్చవుతున్న తరుణంలో జీఎస్టీ ద్వారా ప్రసాదాల తయారీ పదార్థాలపై అదనంగా ఆరు శాతం పన్ను చెల్లించాల్సి వుంటుంది. దీంతో లడ్డూ ప్రసాదాల ధర పెరిగే అవకాశం ఉంది. ఇంకా తిరుమల కొండపై గదుల రేట్లు కూడా పెరిగిపోతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు వెంట రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

01-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

01-04-2025 నుంచి 30-04-2025 వరకు మాస ఫలితాలు

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

30-03-2025 ఆదివారం దినఫలితాలు - ఆర్థిక సమస్య కొలిక్కి వస్తుంది..

తర్వాతి కథనం
Show comments