Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ అమలుతో శ్రీవారి లడ్డూ ధర అప్.. గదులు, దర్శనటిక్కెట్లు కూడా..

జీఎస్టీ అమలుతో తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదం లడ్డూ ధరలు పెరగనున్నాయి. లడ్డూతో పాటు దర్శనం టిక్కెట్లు, ప్రసాదాల ధరలు కూడా పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానమే లక్ష్యంగా జూలై 1వ తేదీ నుంచి కే

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (13:38 IST)
జీఎస్టీ అమలుతో తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదం లడ్డూ ధరలు పెరగనున్నాయి. లడ్డూతో పాటు దర్శనం టిక్కెట్లు, ప్రసాదాల ధరలు కూడా పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానమే లక్ష్యంగా జూలై 1వ తేదీ నుంచి కేంద్రం జీఎస్టీని అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ విధానాలు ప్రతి ఏడాది రూ.20లక్షలకు పైగా ఆదాయం ఆర్జించే ఆలయాలకు కూడా వర్తిస్తాయి. 
 
ఈ క్రమంలో కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జించే తిరుమల శ్రీవారి ఆలయానికి కూడా జీఎస్టీ విధానాలు వర్తిస్తాయి. తద్వారా తిరుమల వెంకన్న ఆలయంలోని ప్రసాదాల ధరలు, దర్శన టిక్కెట్ల ధరలు పెరుగుతాయి. 
 
ప్రస్తుతం ఒక లడ్డూ తయారీకి రూ.35లు ఖర్చవుతున్న తరుణంలో జీఎస్టీ ద్వారా ప్రసాదాల తయారీ పదార్థాలపై అదనంగా ఆరు శాతం పన్ను చెల్లించాల్సి వుంటుంది. దీంతో లడ్డూ ప్రసాదాల ధర పెరిగే అవకాశం ఉంది. ఇంకా తిరుమల కొండపై గదుల రేట్లు కూడా పెరిగిపోతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Navgraha Shanti Bracelet: నెగటివ్ ఎనర్జీ వద్దే వద్దు... నవగ్రహ శాంతి బ్రాస్లెట్‌ను ధరించండి

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

21-05-2025 బుధవారం దినఫలితాలు - వృధా ఖర్చులు తగ్గించుకుంటారు....

20-05-2025 మంగళవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

TTD: శ్రీవారికి రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా ఇచ్చిన మైసూర్ రాజమాత

తర్వాతి కథనం
Show comments