శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆగస్టు నుంచి సర్వదర్శనం

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (13:27 IST)
శ్రీవారి భక్తులకు శుభవార్త. భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న తిరుమల శ్రీవారి సర్వ దర్శనాలు త్వరలోనే మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టులో శ్రీవారి సర్వ దర్శనాలు స్టార్ట్ కావొచ్చని తెలుస్తోంది. 
 
కరోనా పాజిటివిటీ రేటు 1 శాతానికి వస్తే భక్తులకు ఉచిత దర్శన సేవలు పునఃప్రారంభించాలని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. మరో 20 రోజుల్లో కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రూ.300 దర్శన టికెట్ తీసుకున్న వారికి మాత్రమే స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించారు.
 
కరోనా నేపథ్యంలో గతేడాది 2020 మార్చి 20 నుంచి స్వామి వారి సేవలు టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తోంది. కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా కొన్నాళ్లు భక్తులకు దర్శనం కూడా నిలిపివేసింది. 2020 జూన్‌ 7నుంచి రోజుకు 5 వేల మందితో ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు జారీ చేసి దర్శనాలు ప్రారంభించింది. ఆ తర్వాత సామాన్యులకు సైతం స్వామి దర్శనం కల్పించాలనే లక్ష్యంతో సర్వదర్శనం టోకెన్లు కూడా జారీ చేసింది. వీటి కోసం వేలాదిమంది భక్తులు పోటెత్తారు.
 
అయితే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఏర్పడటంతో టీటీడీ సర్వదర్శనం నిలిపివేసింది. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు చిత్తూరు జిల్లాలో కూడా పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ రేటు 1 శాతానికి వచ్చి భక్తుల ఆరోగ్య భద్రతకు ఇబ్బంది లేని పరిస్థితి నెలకొంటే ఆగస్ట్‌లో స్వామి వారి సేవలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడానికి టీటీడీ సమాయత్తమవుతోంది. సేవలతో పాటు సామాన్యులకు ఉచిత దర్శనం కల్పించడానికి సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heat Wave Alert: ఏప్రిల్ 10కి తర్వాత తెలంగాణలో వడగాలులు

36 రోజులుగా ఇంటర్‌నెట్ లేదు, మరో 48 గంటల్లో బీభత్సం: ఇరాన్ ఏమవుతుంది?!!

మంగళవారం ఇరాన్‌లో మరణమృదంగం వినిపిస్తా, రానున్న 48 గంటల్లో బీభత్సం: ట్రంప్ వార్నింగ్

ఆటో సీటు కవర్ చింపేశాడని.. ఏడేళ్ల కుమారుడికి వాతపెట్టిన సైకో తండ్రి

అక్రమ సంబంధం: భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది.. పెట్రోల్ పోసి, గోధుమ గడ్డి కప్పి?

అన్నీ చూడండి

లేటెస్ట్

హనుమజ్జయంతి.. కోటి సంవత్సరాల ముందు పుట్టారు.. 41 రోజుల దీక్ష

02-04-2026 గురువారం ఫలితాలు-విశేషమైన కార్యసిద్ధి ఉంది

ప్రపంచ ధ్యాన నిపుణుల కమిటీకి ఎంపికైన పూజ్యశ్రీ శివకృపానంద్ స్వామిజీ

01-04-2026 బుధవారం ఫలితాలు - ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు

01-04-2026 నుంచి 30-04- 2026 వరకు మాస ఫలితాలు- సత్కాలం సమీపిస్తుంది..

తర్వాతి కథనం
Show comments