Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడిగినన్ని దర్శన టిక్కెట్లు ఇవ్వలేదన్న కోపంతో ఆరోపణలు : టీటీడీ

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (09:28 IST)
శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురం గ్రామంలోని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులపై చేసిన ఆరోపణలపై తితిదే అధికారులు స్పందించారు. స్వామీజీ అడిగినన్ని దర్శన టిక్కెట్లు ఇవ్వలేదన్న కోపంతోనే తమపై ఆరోపణలు చేశారని తితిదే జేఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. 
 
కాగా, తితిదే జేఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తమకు శ్రీవారి దర్శన టికెట్లు ఇవ్వకుండా అవమానించారంటూ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఆరోపణలు చేశారు. స్వామిజీ ఆరోపణలపై టీటీడీ వివరణ ఇచ్చింది. వాస్తవానికి సదరు స్వామీజీ 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని టీటీడీ అధికారులను కోరారని చెప్పారు. అయితే వారు అడిగిన మేరకు వసతి కల్పించేందుకు అంగీకరించడం జరిగిందన్నారు.
 
అయితే సాధారణంగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక ఆ రోజున దర్శనం కొరకు ఇంతమందికి ఇవ్వడం సాధ్యం కాదని, 600 మంది సంఖ్యను తగ్గించాలని అదనపు ఈవో కోరారని, అయితే సదరు స్వామీజీ తాము అడిగిన 600 మందికి దర్శనం కల్పించాలని పట్టుబట్టడం జరిగిందని తితిదే తెలిపింది. తాము అడిగినంతమందికి శ్రీవారి దర్శనం టికెట్లు ఇవ్వలేదన్న కోపంతో మీడియా సమక్షంలో తితిదే అధికారిని తీవ్ర స్థాయిలో కించపరుస్తూ స్వామీజీ మాట్లాడారని, ఇది స్వామీజీ స్థాయికి తగదని టీటీడీ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)

30 నిమిషాల బ్లాక్‌అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి

Surgical Strike: ఫహల్గామ్ దాడి- పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్.. నిజమేనా?

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే

తర్వాతి కథనం
Show comments