Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి వారు తిరుమలకు రావొద్దు : తితిదే

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (16:23 IST)
వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునే నిమిత్తం కొండపైకి భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల సెలవు కావడంతో వీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా అనేక మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఏడుకొండలపైకి వచ్చారు. దీంతో తిరుమల కొండలు భక్తులతో నండిపోయాయి. ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనానికి కనీసం 30 గంటల సమయం పడుతుంది. 
 
శుక్రవారం నుంచి మొదలైన రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రద్దీ ఆదివారం మరింతగా పెరిగింది. దీంతో తితిదే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్వదర్శన టోకెన్లు లేనిభక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌-లోనే కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లలో నిండిపోయాయి. వీరు స్వామి వారిని దర్శించుకునేందుకు 30 గంటలకుపైగా సమయం పడుతుంది. 
 
తిరుమల కొండపై రద్దీ పెరగడంతో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్ఎస్‌డీ, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారు మాత్రమే కొండపైకి రావాలని విజ్ఞప్తి చేసింది. టోకెన్లు లేనివారు కొండపైకి వచ్చి ఇబ్బంది పడొద్దని వారు కోరారు. కాగా, స్వామివారిని శుక్రవారం 71 వేల 782 మంది దర్శనం చేసుకోగా, హిండీ కానుక ద్వారా శ్రీవారికి రూ.3.20 కోట్ల ఆదాయం వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

తర్వాతి కథనం
Show comments