అలాంటి వారు తిరుమలకు రావొద్దు : తితిదే

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (16:23 IST)
వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునే నిమిత్తం కొండపైకి భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల సెలవు కావడంతో వీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా అనేక మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఏడుకొండలపైకి వచ్చారు. దీంతో తిరుమల కొండలు భక్తులతో నండిపోయాయి. ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనానికి కనీసం 30 గంటల సమయం పడుతుంది. 
 
శుక్రవారం నుంచి మొదలైన రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రద్దీ ఆదివారం మరింతగా పెరిగింది. దీంతో తితిదే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్వదర్శన టోకెన్లు లేనిభక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌-లోనే కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లలో నిండిపోయాయి. వీరు స్వామి వారిని దర్శించుకునేందుకు 30 గంటలకుపైగా సమయం పడుతుంది. 
 
తిరుమల కొండపై రద్దీ పెరగడంతో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్ఎస్‌డీ, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారు మాత్రమే కొండపైకి రావాలని విజ్ఞప్తి చేసింది. టోకెన్లు లేనివారు కొండపైకి వచ్చి ఇబ్బంది పడొద్దని వారు కోరారు. కాగా, స్వామివారిని శుక్రవారం 71 వేల 782 మంది దర్శనం చేసుకోగా, హిండీ కానుక ద్వారా శ్రీవారికి రూ.3.20 కోట్ల ఆదాయం వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిండుకుంటున్న పెట్రోల్ నిల్వలు.. దేశం చీకట్లోకి వెళ్లిపోతుందంటున్న పాక్ మంత్రి

సాయినాథుడికి నమస్కారం, శిరిడీలో టీవీకె చీఫ్ విజయ్

సోషల్ మీడియా ద్వారా చీరల వ్యాపారం చేస్తున్న భార్యను హత్య చేసిన భర్త, ఎందుకు?

నాడు దానవీశూరకర్ణ - నేడు కుంభకర్ణుడు : సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం

ఆస్తి కోసం తల్లిదండ్రులు ఇంట్లో వుండగానే ఇంటికి నిప్పు పెట్టిన కుమార్తె

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆదివారం ఆదిత్యుడిని పూజిస్తే...?

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం.. నివేదిక సిద్ధం..జూన్ 30న సమర్పణ

25-04-2026 శనివారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చుచేయండి

శ్రీవారికి కానుకగా 753 గ్రాముల బంగారు పతకాలను ఇచ్చిన బెంగళూరు భక్తురాలు

పెంచలకోన.. భారీ సర్ప ఆకారపు కొండ.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

తర్వాతి కథనం
Show comments