అలాంటి వారు తిరుమలకు రావొద్దు : తితిదే

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (16:23 IST)
వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునే నిమిత్తం కొండపైకి భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల సెలవు కావడంతో వీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా అనేక మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఏడుకొండలపైకి వచ్చారు. దీంతో తిరుమల కొండలు భక్తులతో నండిపోయాయి. ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనానికి కనీసం 30 గంటల సమయం పడుతుంది. 
 
శుక్రవారం నుంచి మొదలైన రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రద్దీ ఆదివారం మరింతగా పెరిగింది. దీంతో తితిదే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్వదర్శన టోకెన్లు లేనిభక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌-లోనే కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లలో నిండిపోయాయి. వీరు స్వామి వారిని దర్శించుకునేందుకు 30 గంటలకుపైగా సమయం పడుతుంది. 
 
తిరుమల కొండపై రద్దీ పెరగడంతో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్ఎస్‌డీ, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారు మాత్రమే కొండపైకి రావాలని విజ్ఞప్తి చేసింది. టోకెన్లు లేనివారు కొండపైకి వచ్చి ఇబ్బంది పడొద్దని వారు కోరారు. కాగా, స్వామివారిని శుక్రవారం 71 వేల 782 మంది దర్శనం చేసుకోగా, హిండీ కానుక ద్వారా శ్రీవారికి రూ.3.20 కోట్ల ఆదాయం వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్‌కు వెళ్లొచ్చిన దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది?

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పిల్లుల్లా బంకర్లలో దాక్కున్నారు : పాక్ అధ్యక్షుడు జర్దారీ (Video)

ఏపీకి రూ.9470 కోట్ల విలువ చేసే రైల్వే ప్రాజెక్టులు : కేంద్రం వెల్లడి

బంగ్లాదేశ్‌లో ఆటవిక రాజ్యం... హిందువులను చంపేస్తున్న అరాచక మూకలు

కర్నాటకలో నిరుపేదల ఇళ్లపై బుల్‌డోజర్... సీఎం సిద్ధూ ఫైర్

అన్నీ చూడండి

లేటెస్ట్

27-12-2025 శనివారం ఫలితాలు - నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త...

అది నైటీయే కానీ డేటీ కాదు కదమ్మా: గరికపాటి చురకలు (video)

26-12-2025 శుక్రవారం ఫలితాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

25-12-2025 గురువారం ఫలితాలు - స్థిరాస్తి ధనం అందుతుంది.. తాకట్టు విడిపించుకుంటారు...

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - ధనుస్సుకు అర్దాష్టమ శని ప్రభావం ఎంత?

తర్వాతి కథనం
Show comments