శ్రీవారి భక్తులకు శుభవార్త - ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణ టోకెన్ల విక్రయం

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (09:39 IST)
తిరుమల శ్రీవారి భక్తులకు తితిదే పాలక మండలి శుభవార్త చెప్పింది. బుధవారం నుంచి శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లను అందుబాటులో ఉంచనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రోజుకు 750 టిక్కెట్ల చొప్పున ఆన్‌లైన్‌‌లో విక్రయిస్తామని తితిదే అధికారులు వెల్లడించారు. ఈ టోకెన్లను కావాలనుకునేవారు https//tirupathibalaji.ap.gov.in అనే వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసు‌కో‌వ‌చ్చని తెలిపారు. 
 
మరోవైపు, పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారికి గరుడసేవ చేయాల్సివుంది. కానీ, ఈ సేవను రద్దు చేశారు. ఈ సేవను ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, ప్రస్తుతం స్వామివారి వార్షిక జ్యేష్ఠాభిషేకం ముగింపు వేడుకలు జరుగుతున్నందున ఈ గరుడ సేవను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

గ్రీన్‌ఫీల్డ్ అమరావతి.. రైతు సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తాం.. మంత్రి నారాయణ

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఫ్రేమ్‌వర్క్.. జీవోను జారీ చేసిన తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

లేటెస్ట్

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

Vaikunta Darshan: ఆన్‌లైన్‌లోనే వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ

19-11-2025 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల: క్యూలైన్లలో లక్షలాది మంది భక్తులు.. నీటి కొరత ఫిర్యాదులు.. ట్రావెన్‌కోర్ ఏమందంటే?

తర్వాతి కథనం
Show comments