శ్రీవారి లడ్డూకు మరో గుర్తింపు.. ఎట్టకేలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌

కలియుక వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి మరో గుర్తింపు లభించింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లైసెన్స్‌ పొందింది. గతంలో లై

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (11:08 IST)
కలియుక వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి మరో గుర్తింపు లభించింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లైసెన్స్‌ పొందింది. గతంలో లైసెన్స్‌ అవసరం లేదన్న టీటీడీ అధికారులు కొంతకాలంగా ఫుడ్ సేఫ్టీ అధికారులతో చర్చలు జరిపారు. లడ్డూ నాణ్యతపై బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
 
ప్రసాదం రూపంలో తయారు చేస్తున్న లడ్డూలో నాణ్యత లేదని.. లడ్డూల తయారీలో ఎఫ్ఎస్ఎస్ఏఐ నియమాలను పాటించడం లేదని ఆరోపణలు వచ్చాయి.  దీనిపై టీటీడీ వివరణ ఇచ్చినప్పటికీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సంతృప్తి చెందలేదు. లడ్డూల విషయంలో నాణ్యత పాటించాలని సూచించింది. ప్రస్తుతం ఆ ప్రమాణాలకు అనుగుణంగా లడ్డూలను తయారు చేస్తుండటంతో ఎట్టకేలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌ ఇచ్చింది.
 
గతంలో శ్రీవారి లడ్డూకు లైసెన్స్ తీసుకోవడానికి టీటీడీ నిరాకరించింది. లడ్డూ అనేది ప్రసాదం అని, ఇది ఆహార పదార్థం కాదని కాబట్టి దీనికి లైసెన్స్ అవసరం లేదని చెప్పింది. అంతేకాదు దీనిని ఉచితంగా, రాయితీకి ఇస్తామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైద్య విద్యార్థినిలు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసిన మేల్ నర్స్

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

23-11-2025 ఆదివారం ఫలితాలు - ఆచితూచి అడుగేయండి.. భేషజాలకు పోవద్దు...

నవంబర్ 26 నుంచి 17 ఫిబ్రవరి 2026 వరకూ శుక్ర మౌఢ్యమి, శుభకార్యాలకు బ్రేక్

సమాధిలోని దీపపు కాంతిలో దేదీప్యమానంగా వీరబ్రహ్మేంద్రస్వామి

తర్వాతి కథనం
Show comments