Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ధర్మకర్తల మండలి సభ్యులు వీరేనా?

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (11:48 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలికి కొత్త సభ్యుల నియామకం దాదాపుగా ఖరారైపోయింది. ఇప్పటికే టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని ఏపీ సర్కారు నియమించింది. ఇపుడు ధర్మకర్తల మండలి సభ్యుల పేర్లు ఖరారైనట్టు సమాచారం. 
 
ఇదే అంశంపై పాలకమండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. ప్రతిపాదనల్లో ఉన్న పేర్లపై చర్చించి తుది జాబితాకు ఆమోదం తెలిపారని సమాచారం. ప్రస్తుతం పాలకమండలి సభ్యుల సంఖ్య 19 ఉండగా.. ఈసంఖ్యను 25కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్‌ ఆమోదముద్ర వేయగానే సభ్యుల పేర్లు వెల్లడించనున్నారు. 
 
కొత్తగా ఎంపికైన సభ్యుల్లో తమిళనాడు నుంచి ఇండియా సిమెంట్స్‌ ఎండీ ఎన్‌.శ్రీనివాసన్‌, కృష్ణమూర్తి, కర్ణాటక నుంచి కృపేందర్‌ రెడ్డి, సుందర్‌, తెలంగాణ నుంచి ముగ్గురుండనున్నారు. పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్‌రావు పేరు వినిపిస్తోంది. ఏపీ నుంచి ఎమ్మెల్యేల్లో యూవీ రమణమూర్తి రాజు -యలమంచిలి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి(కాకినాడ) పేర్లు వినిపిస్తున్నాయి. తుడా ఛైర్మన్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పదవిరీత్యా తితిదే పాలకమండలిలో సభ్యుడుగా ఉండనున్నారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి భార్య ప్రశాంతిరెడ్డి పేరు వినిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments