Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే అద్దె గదుల బుకింగ్‌లో కొత్త నిబంధనలు

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (15:42 IST)
తిరుమలలో అద్దె గదుల కేటాయింపులో ఇప్పటివరకు ఉన్న నిబంధనను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి మార్పులు చేసింది. ఇకపై అద్దె గదుల బుకింగ్‌లో క్యాష్ ఆన్ డిపాజిట్ విధానాన్ని తక్షణం అమల్లోకి తెస్తున్నట్టు తెలిపింది. 
 
ఇందులోభాగంగా ఆన్‌లైన్ మాధ్యమంలో గదిని బుక్ చేసుకునే భక్తులు, ముందుగానే రెట్టింపు మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి వుంటుందని పేర్కొంది. గదిని ఖాళీ చేసిన తర్వాత ఆ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇస్తామని తెలియజేసింది.
 
ఇకపోతే, ఆఫ్‌లైన్‌లో అంటే, తిరుమలకు వచ్చి అక్కడి కౌంటర్లలో గదులను బుక్ చేసుకునే భక్తులకు, ఈ నెలాఖరు నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుందని, భక్తులు గమనించాలని కోరింది. 
 
కాగా, గతంలో తిరుమలలో అద్దె గదుల బుకింగ్‌నకు ఇదే విధానం అమలులో ఉండేది. ఆపై చంద్రబాబు ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏ రోజు గదికి అదే రోజు అద్దె చెల్లించే విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు తిరిగి పాత విధానంలోకి తీసుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భయానకంగా భార్య హత్య, చంపడంలో చావు తెలివితేటలు, పోలీసులకు సవాల్

మత్తుకళ్ల సుందరి మోనాలిసా ఇల్లు ఎలా ఉందో చూశారా? (Video)

భార్యకు బహుమతి ఇవ్వాలనీ.. తనకు తానే వేసెక్టమీ ఆపరేషన్ చేసుకున్న వైద్యుడు (Video)

మానవత్వం చాటుకున్న మంత్రి మనోహర్... యువకుడికి ప్రాథమిక చికిత్స

పరస్పర అంగీకారంతో శృంగారం... మహిళపై భౌతికదాడికి లైసెన్స్ కాదు : కోర్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

23-01-2025 గురువారం దినఫలితాలు : దంపతుల మధ్య సఖ్యత...

22-01-2025 బుధవారం దినఫలితాలు : కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి...

జనవరి 22: కృష్ణపక్ష కాలాష్టమి.. మిరియాలు, గుమ్మడి, కొబ్బరి దీపం వెలిగిస్తే..?

తిరుమల అద్భుతాలు.. కలియుగాంతంలో వెంకన్న అప్పు తీరుతుందట! నిజమేనా?

Mahakumbh 2025: కుంభమేళా పండుగకు వెళ్తున్నారా? ఐతే ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి.. (video)

తర్వాతి కథనం
Show comments