Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే అద్దె గదుల బుకింగ్‌లో కొత్త నిబంధనలు

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (15:42 IST)
తిరుమలలో అద్దె గదుల కేటాయింపులో ఇప్పటివరకు ఉన్న నిబంధనను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి మార్పులు చేసింది. ఇకపై అద్దె గదుల బుకింగ్‌లో క్యాష్ ఆన్ డిపాజిట్ విధానాన్ని తక్షణం అమల్లోకి తెస్తున్నట్టు తెలిపింది. 
 
ఇందులోభాగంగా ఆన్‌లైన్ మాధ్యమంలో గదిని బుక్ చేసుకునే భక్తులు, ముందుగానే రెట్టింపు మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి వుంటుందని పేర్కొంది. గదిని ఖాళీ చేసిన తర్వాత ఆ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇస్తామని తెలియజేసింది.
 
ఇకపోతే, ఆఫ్‌లైన్‌లో అంటే, తిరుమలకు వచ్చి అక్కడి కౌంటర్లలో గదులను బుక్ చేసుకునే భక్తులకు, ఈ నెలాఖరు నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుందని, భక్తులు గమనించాలని కోరింది. 
 
కాగా, గతంలో తిరుమలలో అద్దె గదుల బుకింగ్‌నకు ఇదే విధానం అమలులో ఉండేది. ఆపై చంద్రబాబు ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏ రోజు గదికి అదే రోజు అద్దె చెల్లించే విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు తిరిగి పాత విధానంలోకి తీసుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments