రాజకీయ నేతల కంబధ హస్తాల్లో శ్రీవారి ఆలయం : రమణ దీక్షితులు

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాజకీయ నాయకులే భ్రష్టుపట్టిస్తున్నారంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు.

Webdunia
బుధవారం, 16 మే 2018 (15:19 IST)
కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాజకీయ నాయకులే భ్రష్టుపట్టిస్తున్నారంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదాన్ని ఓ వ్యాపారంగా మార్చుతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. చెన్నై పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
1996లో శ్రీవారి ఆలయంలో వంశ పారంపర్యం అర్చకత్వాన్ని ప్రభుత్వం ఉన్నపళంగా రద్దు చేసిందని, అందుకు గల కారణాలు తెలియవన్నారు. వంశపారంపర్య అర్ఛకత్వాన్ని రద్దు చేసిన ప్రభుత్వం అందుకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. అదేసమయంలో అధికారులు కూడా స్వామి వారి కైంకర్యాల్లో తలదూర్చుతున్నారని, ఈ విషయమై అర్చకులను బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు. 
 
ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న తనకే స్వామి వారి ఆభరణాల వివరాలు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రమణ దీక్షితులు, శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి ఇచ్చిణ ఆభరణాలు ఎక్కడున్నాయని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాజకీయ నాయకుల కబంధహస్తాల నుంచి శ్రీవారి ఆలయాన్ని కాపాడుకోవాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో.... మోటార్ బైక్ సీటు కింద నాగుపాము (video)

Montha To Hit AP: ఏపీలో మొంథా తుఫాను.. బెంగళూరులోనే జగన్మోహన్ రెడ్డి

నిర్లక్ష్యం.. తెలియక ఏసీ భోగీలోకి ఎక్కి కింద దిగబోయాడు.. ఇంతలో కాలుజారింది.. చివరికి? (video)

దిశ మార్చుకుంటున్న Cyclone Montha, తీరం అక్కడ దాటే అవకాశం...

హైదరాబాద్ నగరంలో ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

27-10-2025 సోమవారం దినఫలాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

Skanda Sashti 2025: స్కంధ షష్ఠి రోజున పూజ ఎలా చేయాలి.. ఏ శ్లోకాన్ని పఠించాలి?

ఇంద్రకీలాద్రిపై నాగుల చవితి వేడుకలు.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో?

26-10-2025 ఆదివారం దినఫలాలు - ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు...

26-10-2025 నుంచి 02-11-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments