Publish Date: Wed, 02 Jul 2025 (10:16 IST)
Updated Date: Wed, 02 Jul 2025 (10:22 IST)
దర్శన టిక్కెట్లు, వసతి కోసం మధ్యవర్తుల బారిన పడవద్దని టిటిడి తన భక్తులను మరోసారి హెచ్చరించింది. పెద్దింటి ప్రభాకరాచార్యులు పేరుతో వైష్ణవ యాత్రలు అనే ఫేస్బుక్ పేజీని నిర్వహిస్తున్న వ్యక్తి శ్రీవారి అభిషేకం, ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనం, రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శన టిక్కెట్ల లభ్యతను తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిటిడి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
భక్తులు ఇలాంటి నకిలీ వ్యక్తులను లేదా వెబ్సైట్లను నమ్మవద్దని టిటిడి హెచ్చరించింది. అన్ని టిక్కెట్లను అధికారిక టిటిడి వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. శ్రీవారి దర్శన టిక్కెట్ల పేరుతో భక్తులను మోసం చేయడానికి ప్రయత్నించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.