Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Advertiesment
Google Vice President

సెల్వి

, గురువారం, 26 జూన్ 2025 (18:40 IST)
ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి కానుకల వర్షం కురుస్తూనే వుంటుంది. శ్రీవారి హుండీలో రోజూ లక్షల విలువ చేసే కానుకలు వచ్చి పడుతుంటాయి. తాజాగా గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. 
 
ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును తిరుమలలోని తన క్యాంప్ కార్యాలయంలో టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడుకు అందజేశారు. ఆలయ పట్టణంలోని ఛైర్మన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తోట అందించిన విరాళాన్ని టీటీడీ అధికారులు అభినందించారు. 
 
ఇకపోతే టీటీడీ అనుబంధ ఆలయాలైన నందలూరు, తాళ్లపాకలలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నందలూరులో జూలై 5 నుండి 13 వరకు, తాళ్లపాకలో జూలై 6 నుండి 15 వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)