Webdunia - Bharat's app for daily news and videos

Install App

శభాష్ ఈవోగారూ అంటున్న భక్తులు... సారీ వీఐపీ సార్‌ అంటున్న తితిదే సిబ్బంది.. ఎందుకు?

తిరుమల తిరుపతి ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించినపుడు అనేక విమర్శలు చెలరేగాయి. ఉత్తర భారతదేశానికి చెందిన ఓ ఐఏఎస్ అధికారిని ఎలా నియమిస్తారంటూ అనేక మంది ప్రశ్నించారు. ఈ విమర్శలకు ప్రతి విమర్శలు చేయ

Webdunia
బుధవారం, 31 మే 2017 (09:28 IST)
తిరుమల తిరుపతి ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించినపుడు అనేక విమర్శలు చెలరేగాయి. ఉత్తర భారతదేశానికి చెందిన ఓ ఐఏఎస్ అధికారిని ఎలా నియమిస్తారంటూ అనేక మంది ప్రశ్నించారు. ఈ విమర్శలకు ప్రతి విమర్శలు చేయని ఈవో అనిల్ కుమార్.. ఇపుడు తన నిర్ణయాలతో భక్తులతో పాటు.. తితిదే సిబ్బంది కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనికి తాజాగా జరిగిన ఓ సంఘటనే నిదర్శనం. 
 
'సారీ సార్‌. మంత్రిగారు స్వయంగా వస్తేనే బ్రేక్‌ దర్శనం టికెట్లు ఇస్తాం. సిఫారసులకు ఇవ్వలేం'... 'నేను మంత్రికి స్వయానా సోదరుడినయ్యా.. కుటుంబం అంతా వచ్చాం. ఇప్పుడు లేదంటే ఎలా?'.. 'వేసవి రద్దీ చాలా తీవ్రంగా ఉంది సార్‌. ఈవో గారు నిర్ణయం తీసుకున్నారు. సహకరించండి ప్లీజ్‌'.. అంటూ తిరుమల దైవదర్శనానికి మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను తితిదే సిబ్బంది తిరస్కరిస్తున్నారు. మంత్రి బంధువైనా, బామ్మర్ది అయినా బ్రేకు దర్శనం లేదు. వేసవి రద్దీతో బ్రేకులు కట్టుదిట్టం. రోజుకు 300లకు మించకుండా కట్టడి చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. 
 
ఇదే అంశంపై తిరుమల జేఈవో కార్యాలయం సిబ్బందికీ, రాష్ట్రమంత్రి ఒకరి సోదరుడికీ మంగళవారం ఉదయం జరిగిన సంభాషణ ఇది. వెంటనే మంత్రిగారు లైన్‌లోకి వచ్చారు. మరింత వినయంగా సిబ్బంది మళ్లీ అదేసమాధానం ఇచ్చారు. సామాన్య భక్తుల కోసం సహకరించమంటూ అభ్యర్థించారు. ఆగ్రహించినా, అభ్యర్థించినా ఏం చేయలేని పరిస్థితి! మంత్రిగారి ఇలాకా వెనుతిరగక తప్పలేదు. వేసవి రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ప్రొటోకాల్‌కే పరిమితం చేశారు. ఇలా కఠినంగా వ్యవహరించడంతో వీఐపీ సిఫార్సు లేఖలతో వచ్చిన వారు ఖంగు తింటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

లేటెస్ట్

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments