Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుచానూరులో ఇక తిరుమల తరహా దర్శనం

తిరుపతి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా తిరుమల తరహా దర్శనం కల్పించనున్నారు. అంటే బ్రేక్ దర్శన సౌకర్యాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ప్రారంభిం

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (10:11 IST)
తిరుపతి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా తిరుమల తరహా దర్శనం కల్పించనున్నారు. అంటే బ్రేక్ దర్శన సౌకర్యాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ప్రారంభించనున్నట్లు ఆలయ ప్రత్యేక డిప్యూటీ ఈవో ముణిరత్నం రెడ్డి తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తిరుమల తరహాలో తిరుచానూరులో కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనం ప్రవేశపెట్టాలని తితిదే పాలకమండలి నిర్ణయించిందన్నారు. ఈ వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, రాత్రి 7:00 నుంచి 7:30 గంటల వరకు ఉంటుందన్నారు. 
 
అయితే, వీఐపీ దర్శనం పరిధిలోకి వచ్చే ప్రముఖులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రొటోకాల్‌ పరిధిలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ టికెట్లు కేటాయిస్తామన్నారు. రానున్న రోజుల్లో అమ్మవారి ఆర్జితసేవ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి దర్శన వేళల సమయాన్ని మరో గంటపాటు అదనంగా పొడిగించామన్నారు. ఉదయం 4:30 గంటలకు ఆలయాన్ని తెరిచి రాత్రి 9:30 గంటలకు మూసివేస్తామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments