తిరుచానూరులో ఇక తిరుమల తరహా దర్శనం

తిరుపతి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా తిరుమల తరహా దర్శనం కల్పించనున్నారు. అంటే బ్రేక్ దర్శన సౌకర్యాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ప్రారంభిం

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (10:11 IST)
తిరుపతి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా తిరుమల తరహా దర్శనం కల్పించనున్నారు. అంటే బ్రేక్ దర్శన సౌకర్యాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ప్రారంభించనున్నట్లు ఆలయ ప్రత్యేక డిప్యూటీ ఈవో ముణిరత్నం రెడ్డి తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తిరుమల తరహాలో తిరుచానూరులో కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనం ప్రవేశపెట్టాలని తితిదే పాలకమండలి నిర్ణయించిందన్నారు. ఈ వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, రాత్రి 7:00 నుంచి 7:30 గంటల వరకు ఉంటుందన్నారు. 
 
అయితే, వీఐపీ దర్శనం పరిధిలోకి వచ్చే ప్రముఖులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రొటోకాల్‌ పరిధిలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ టికెట్లు కేటాయిస్తామన్నారు. రానున్న రోజుల్లో అమ్మవారి ఆర్జితసేవ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి దర్శన వేళల సమయాన్ని మరో గంటపాటు అదనంగా పొడిగించామన్నారు. ఉదయం 4:30 గంటలకు ఆలయాన్ని తెరిచి రాత్రి 9:30 గంటలకు మూసివేస్తామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nagula chavithi: నాగుల చవితి రోజున అద్భుతం.. పుట్టనుంచి భక్తులకు నాగదేవత దర్శనం

కర్నూలు ఘటనపై సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు.. వారు ఉగ్రవాదులు కాక ఇంకేమవుతారు..?

Hyderabad: హైదరాబాదులో 18 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం

రేబిస్‌తో బాలిక మృతి.. కుక్క కరిచిందని తల్లిదండ్రులకు చెప్పలేదు.. చివరికి?

Google: గూగుల్ చెల్సియా కార్యాలయంలో నల్లుల బెడద.. అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్

అన్నీ చూడండి

లేటెస్ట్

పంచమి రోజున వారాహి పూజ... ఏ రాశుల వారు ఆమెను పూజించాలి.. తెలుపు బీన్స్?

2026 పూరీ జగన్నాథుని రథయాత్రతో ప్రారంభం.. సేంద్రియ బియ్యంతో మహా ప్రసాదం

24-10-2025 శుక్రవారం దినఫలాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. విలాసాలకు వ్యయం చేస్తారు...

నాగుల చవితి ఎప్పుడు? కలి దోషం తీరాలంటే.. సర్పాలను ఎందుకు పూజించాలి?

అడిలైడ్ ఓవల్ వన్డే : విరాట్ కోహ్లీ మళ్లీ డకౌట్

తర్వాతి కథనం
Show comments