Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే పాలకమండలి నుంచి సాయన్నను తొలగిస్తూ ఉత్తర్వులు... ప్రమాణ స్వీకారం లేకుండానే...

Webdunia
సోమవారం, 2 మే 2016 (17:34 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో తెలంగాణా ప్రాంతానికి చెందిన సాయన్నను తొలగిస్తూ దేవదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జి.ఓ.నెంబర్‌ 187ను దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.ఎస్‌.వి.ప్రసాద్‌ విడుదల చేశారు. 
 
టిటిడి పాలకమండలి సమావేశం జరిగే సమయంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్‌ఎస్‌లోకి జంప్‌ అయ్యారు సాయన్న. అంతేకాకుండా నాలుగుసార్లు జరిగిన పాలకమండలి సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో పాలకమండలి నుంచి సాయన్నను తొలగిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి జీవో జారీ చేశారు.
 
మరోవైపు... తితిదే పాలకమండలి ఛైర్మన్‌గా మరో యేడాది పాటు చదలవాడ క్రిష్ణమూర్తిని నియమిస్తూ సంతకం చేసిన జిఓ పత్రాలు చదలవాడ కృష్ణమూర్తికి చేరాయి.. గతనాలుగు రోజులకు ముందే ముఖ్యమంత్రి టిటిడి పాలకమండలిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. దీంతో దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శ జె.ఎస్‌.వి.ప్రసాద్‌ పాలకమండలిని కొనసాగిస్తూ జి.ఓ.నెంబర్‌ 188ని విడుదల చేశారు. 
 
ఈ జిఓ నెంబర్‌ ప్రకారం 15మంది పాలకమండలి సభ్యులతో పాటు టిటిడి ఛైర్మన్‌ అదే పదవిలో కొనసాగనున్నారు. అయితే దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి విడుదల చేసిన జిఓ సోమవారం మధ్యాహ్నం 4 గంటలకు ఛైర్మన్‌‌తో పాటు సభ్యుల చేతికి చేరింది. జిఓ ప్రకారం సభ్యులెవరు తిరిగి ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం లేకుండానే, పాలకమండలి సభ్యులుగా కొనసాగనున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments