Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల క్షేత్రంలో దసరా ఉత్సవాలు : నేడు శ్రీవారి గరుడ సేవ

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (09:29 IST)
తిరుమల పుణ్యక్షేత్రంలో దసరా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారు సర్వ భూపాల వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం గరుడ సేవను నిర్వహించనున్నారు. ఈ సేవలు లక్షలాదిగా ప్రజలు తరలిరానుండటంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసినట్టు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గరుడ సేవలో భాగంగా, స్వామివారు గరుడ వాహనంపై నాలుగు తిరుమాడ వీధుల్లో విహించనున్నారు. 
 
ఈ దసరా బ్రహ్మోత్సవాలపై తితిదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, గరుడ సేవను కనులారా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారని, తితిదే ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో అదుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులు చిన్న అసౌకర్యానికి కూడా గురికాకుండా తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్సనం చేసుకుని వెళ్లాలన్నదే తమ అభిమతమని భూమన తెలిపారు. స్వామివారి సేవలో పాల్గొనం అనేది జన్మజన్మల పుణ్యఫలం, అదృష్టమని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

తర్వాతి కథనం
Show comments