Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 1 నుంచి గోవింద రాజస్వామి ఆలయ దర్శన వేళలు మార్పు

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (10:33 IST)
మే ఒకటో తేదీ నుంచి తిరుపతి గోవింద రాజస్వామి ఆలయ భక్తుల దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆలయ స్పెషల్‌ గ్రేడ్‌ డెప్యూటీ ఈఈఓ రాజేంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. 
 
కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ స్వామి వారి దర్శన సమయాల్లో మార్పులు చేస్తూ.. ఉప ఆలయాల్లో దర్శనాలు రద్దు చేసింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలుపుతారు. 
 
అనంతరం 6.30 గంటలకు స్వామి వారికి తోమాల సేవ, సహస్రనామార్చన సేవలు నిర్వహించనున్నారు. ఈ సేవల కాలంలో భక్తులకు లఘు దర్శనం కల్పిస్తారు. ఉదయం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు, 9.30 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు. 
 
సాయంత్రం 6 గంటల తర్వాత దర్శనానికి అనుమతించరు. రాత్రి కైంకర్యాలు, ఏకాంత సేవ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. అలాగే గోవింద రాజస్వామి ఆలయ ప్రాంగణంలోని ఉప ఆలయాల్లో భక్తులకు దర్శనాలను రద్దు చేశారు. భక్తులు విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది. ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

అన్నీ చూడండి

లేటెస్ట్

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

30-03-2025 ఆదివారం దినఫలితాలు - ఆర్థిక సమస్య కొలిక్కి వస్తుంది..

Ugadi 2025: శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం.. విశేష ధనం లభిస్తుందట..

30-03-2025 నుంచి 05-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు..దంపతుల మధ్య అకారణ కలహం

29-03-2025 శనివారం దినఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం...

తర్వాతి కథనం
Show comments