Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి గంగమ్మకు పొంగళ్లతో మొక్కులు

Webdunia
సోమవారం, 16 మే 2016 (12:09 IST)
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర కొనసాగుతోంది. జాతరలో భాగంగా భక్తులు గంగమ్మకు పొంగళ్లతో నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. గత ఆరు రోజులుగా వివిధ వేషధారణలతో మొక్కులు తీర్చుకోగా రేపు (మంగళవారం) ప్రధాన జాతర జరుగనుంది. రాయలసీమ జిల్లాల నుంచి అధికసంఖ్యలో భక్తులు రేపు తిరుపతికి చేరుకోనున్నారు. భక్తుల కోసం తిరుపతి గంగమ్మ దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
 
ఆలయ ఆవరణలోనే పొంగళ్లు పెడుతూ గంగమ్మను సేవిస్తున్నారు. ఆలయంలో పొంగళ్ల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లను కూడా ఏర్పాటు చేయడంతో ఎలాంటి తోపులాటలు లేకుండా గంగమ్మను మొక్కుతున్నారు భక్తులు. నిన్నటి నుంచే గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. 
 
సోమవారం ఉదయం సున్నపు కుండల వేషంలో భక్తులు గంగమ్మను దర్శించుకుంటున్నారు. ఇద్దరు కైకాల కులస్తులు సున్నపు కుండల వేషాన్ని మొదటగా ధరిస్తారు. పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మకు ప్రతీకలుగా ఈ వేషాన్ని వేస్తారు. వీరు పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్ళి హారతులను స్వీకరిస్తున్నారు. 18వ తేదీ ప్రధాన ఘట్టం విశ్వరూప దర్శనం జరుగనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

హమ్మయ్య.. తిరుమలలో తగ్గిన ఫాస్ట్ ఫుడ్స్- కారం, నూనె పదార్థాలొద్దు.. ఆ వంటకాలే ముద్దు!

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

తర్వాతి కథనం
Show comments