Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమియుమి అస్సెట్స్ కంపెనీతో తిరుపతి నగరాభివృద్ధి: వారణాసికి తర్వాత తిరుపతి..

కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర ఆలయం నెలకొన్న తిరుమల, తిరుపతి నగరాల అభివృద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు నడుం బిగించారు. దక్షిణ భారత దేశంలోనే ప్రఖ్యాతి చెందిన టెంపుల్ సిటీ అయిన తిరుపతికి వేలాది మంది భక్తులు

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2017 (14:21 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర ఆలయం నెలకొన్న తిరుమల, తిరుపతి నగరాల అభివృద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు నడుం బిగించారు. దక్షిణ భారత దేశంలోనే ప్రఖ్యాతి చెందిన టెంపుల్ సిటీ అయిన తిరుపతికి వేలాది మంది భక్తులు వచ్చిపోతుంటారు. అలాంటి తిరుపతిని మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. 
 
మొన్నటికి మొన్న తిరుమల వెంకన్న కొలువుదీరిన మహానగరంలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.1500 కోట్లతో మ్యూజియం నిర్మించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేసేందుకు జపాన్‌కు చెందిన 'కుమియుమి అస్సెట్స్ కంపెనీ' ముందుకు వచ్చింది.
 
బుధవారం దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కుమియుమి అస్సెట్స్ మేనేజిమెంట్ కంపెనీ ప్రెసిడెంట్ యసుయో యమజకి సమావేశమయ్యారు. ఇప్పటికే పుణ్యధామం వారణాసి నగరాభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నామని, తిరుపతి నగరాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని సీఎంకు వివరించారు. 
 
కుమియుమికి ఫండ్, టెక్నాలజీ, ప్రాజెక్టుమేనేజిమెంట్ రంగాలలో ఆసక్తి వుందట. గృహ నిర్మాణం, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ రంగాలలో జపనీస్ కంపెనీలతో కలిసి ఒక కన్సార్టియంగా ముందుకొచ్చి 15 నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడిని తీసుకురాగలమని కుమియుమి ప్రెసిడెంట్ ప్రతిపాదించారట. దీనికి స్పందించిన సీఎం స్పష్టమైన ప్రణాళికతో రావాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Masood Azhar: మసూద్ అజార్‌కు రూ.14కోట్ల పరిహారం ఇస్తోన్న పాకిస్థాన్.. ఎందుకంటే?

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

అన్నీ చూడండి

లేటెస్ట్

11-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ

శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం

Shani Trayodashi 2025: శని త్రయోదశి నాడు ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments