Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సామాన్య భక్తులకే పెద్దపీట.. 6లక్షల లడ్డూలు సిద్ధం!

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2015 (16:33 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు తీసుకున్నామని ఈఓ సాంబశివరావు వెల్లడించారు. వచ్చే నెల 16 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్న నేపథ్యంలో.. తిరుమలలో దర్శనం, ఆర్జిత సేవలు వంటి ఇతరత్రా విషయాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు. 
 
మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ.. సాధ్యమైనంత ఎక్కువ సేపు స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తామన్నారు. గరుడోత్సవం రోజున వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఈవో వ్యాఖ్యానించారు. బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులూ 24 గంటల పాటు కనుమ రహదారుల్లో వాహనాల రాకపోకలకు అనుమతిస్తామని తెలిపారు. 
 
అన్ని రకాల ఆర్జిత సేవలనూ రద్దు చేశామని, భక్తుల కోసం 6 లక్షల లడ్డూలను సిద్ధం చేయనున్నామని ఈవో సాంబశివరావు వెల్లడించారు. శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులు తుది దశకు చేరుకున్నాయని, బ్రహ్మోత్సవాల భద్రత కోసం కొత్తగా 300 సీసీ కెమెరాలను అమర్చనున్నామని వివరించారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments