Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో తగ్గిన శ్రీవారి హుండీ ఆదాయం..?

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం తగ్గింది. శ్రీవారి వెంకన్నకు భక్తులు కాసుల వర్షం కురిపిస్తారు. అయితే పెద్ద నోట్ల రద్దు కారణంగా, ఆన్ లైన్ విరాళాలు పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం తగ్గుమఖం పట్

Webdunia
శనివారం, 6 జనవరి 2018 (13:14 IST)
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం తగ్గింది. శ్రీవారి వెంకన్నకు భక్తులు కాసుల వర్షం కురిపిస్తారు. అయితే పెద్ద నోట్ల రద్దు కారణంగా, ఆన్ లైన్ విరాళాలు పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం తగ్గుమఖం పట్టిందని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వెల్ల‌డించింది. 2017లో హుండీ ఆదాయ వివ‌రాల‌ను ఓసారి పరిశీలిస్తే.. 2016 కంటే 2017 హుండీ ఆదాయం త‌గ్గింద‌ని తెలిపింది.
 
ఇందుకు ప్రధాన కారణం కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన నోట్ల ర‌ద్దేనని తెలుస్తోంది. ఏడాది మొత్తానికి రూ. 995.89 కోట్లు హుండీ ఆదాయం వ‌చ్చింది. ఈ  ఆదాయం.. 2016 ఆదాయం రూ. 1046.28 కోట్లతో పోల్చితే దాదాపు రూ. 50 కోట్లు త‌క్కువని తితిదే వెల్లడించింది. 
 
నోట్ల ర‌ద్దు త‌ర్వాత ర‌ద్దైన నోట్ల‌ను హుండీలో వేయ‌డం వ‌ల్ల ఆదాయం తగ్గిందని టీటీడీ అధికారుల అంచనా. ఇంకా ఆన్‌లైన్‌లోనే వెంకన్నకు భక్తులు సమర్పించే విరాళాలు, కానుకలు పెరిగిపోతున్నాయని వారు అన్నారు. జీఎస్టీ ఎఫెక్ట్ కూడా హుండీ ఆదాయంపై పడిందని తితిదే అధికారులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Birthday: బర్త్ డే జరుపుకుందామనుకుంటే.. కేకు పేలింది.. (video)

అధ్యక్షా... ఈ పోల్ ఇపుడు అవసరమా? పరువు పోగొట్టుకున్న టి.కాంగ్రెస్, రేవంత్ ఫైర్

Hall Tickets: హాల్ టిక్కెట్లు లేకపోయినా పరీక్షలు రాయడానికి అనుమతి.. ఎక్కడంటే?

అది మా పనోళ్ల కోసం నిర్మించిన సెక్యూర్డ్ భవనం : మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Video)

ప్రయాగ్ రాజ్ మోనాలిసా ఇంటికి దర్శకుడు సనోజ్ మిశ్రా, సినీ ఆఫర్ కన్ఫర్మ్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

మౌని అమావాస్య వేళ త్రివేణి యోగం.. ఈ మూడు రాశులకు లాభాలు

29-01-2025 బుధవారం దినఫలితాలు : పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు...

Mauni Amavasya: మౌని అమావాస్య, ఏం చేయాలి?

Shab e Meraj విశ్వ సృష్టికర్త అల్లాహ్‌ను కలిసే గౌరవం పొందిన పవిత్ర రాత్రి

28-01-2025 మంగళవారం దినఫలితాలు : దంపతుల మధ్య సఖ్యత లోపం...

తర్వాతి కథనం
Show comments