Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు : ఈవో ధర్మారెడ్డి

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (16:01 IST)
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ యేడాది సెప్టెంబరు 27వ తేదీ నుంచి జరుగనున్నాయి. 27న ధ్వజారోహణంతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయని తితిదే ఈవో ధర్మ ధర్మారెడ్డి తెలిపారు. 
 
ఆయన శుక్రవారం సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై తితిదే అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామని చెప్పారు. ఈ యేడాది యధావిధిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, తిరువీధుల్లో స్వామివారు విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. 
 
ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 1న గరుడసేవ, 2న బంగారు రథం, 4న మహారథం 5న, చక్రస్నానం వేడుకలను నిర్వహిస్తామన్నారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తామని తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలు, వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలను రద్దు చేస్తున్నామని ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

తర్వాతి కథనం
Show comments